టాప్ టెన్లోని 9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.51 లక్షల కోట్లు జంప్
టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.51 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టాప్ గెయినర్గా నిలిచింది. గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1367 పాయింట్లు లేదా 2.66 శాతం లాభపడింది. సెన్సెక్స్ 52,727 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ 10లోని తొమ్మిది కంపెనీలు గతవారం లాభాల్లో ముగియగా, దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం నష్టపోయింది. టాప్ టెన్లో ఈ ఒక్క కంపెనీ మాత్రమే నష్టపోయింది.
గతవారం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74,534.87 కోట్లు పెరిగి రూ.12,04,907.32 కోట్లకు చేరుకుంది. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.44,888.95 కోట్లు ఎగిసి రూ.5,41,240.10 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.35,427.18 కోట్లు ఎగిసి రూ.7,51,800.31 కోట్లకు, HDFC మార్కెట్ క్యాప్ రూ.24,747.87 కోట్లు పెరిగి రూ.3,97,190.50 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.22,888.49 కోట్లు లాభపడి రూ.6,06,734.50 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.17,813.78 కోట్లు పెరిగి రూ.4,96,354.36 కోట్లకు, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.15,185.45 కోట్లు ఎగిసి రూ.3,68,789.63 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ 11,914.36 కోట్లు లాభపడి రూ.4,05,489.73 కోట్లకు, ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.4,427.5 కోట్లు పెరిగి రూ.4,18,525.10 కోట్లకు పెరిగింది.
అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.59,901.07 కోట్లు నష్టపోయి రూ.16,91,785.45 కోట్లకు దిగి వచ్చింది. టాప్ టెన్ కంపెనీల్లో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ఐసీ, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.