8వ విడత జీఎస్టీ రుణాలు విడుదల: ఏపీ, తెలంగాణలకు ఎన్ని వచ్చాయంటే?
ఎనిమిదో విడత జీఎస్టీ రుణాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం కింద రూ.6వేల కోట్లను సోమవారం రిలీజ్ చేసింది. 23 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం విడుదల చేసిన మొత్తం రూ.48వేల కోట్లుగా ఉంది.
ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.688.59 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1181.61 కోట్ల రుణాలను విడుదల చేసింది. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుండి రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు రుణాలు మంజూరు చేస్తోంది.
వీక్లీ ఇన్స్టాల్మెంట్ను కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 23, నవంబర్ 2, నవంబర్ 9, నవంబర్ 23, డిసెంబర్ 1, డిసెంబర్ 7, డిసెంబర్ 14, ఇప్పుడు డిసెంబర్ 21న విడుదల చేసింది.