న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఏడో వేతన సవరణ సంఘం (7th Pay Commission) సమావేశం ఖరారైంది. ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance-DA), డియర్నెస్ రిలీఫ్ (Dearness Relief-DR)పై చర్చించడానికి ఈ నెల 26వ తేదీన అధికారిక భేటీ ఏర్పాటు కానుంది. ఈ సమావేశం విజయవంతమైతే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించినట్టే. వారికి అందాల్సిన డీఏ, డీఆర్ బకాయిల విడుదల తేదీ ఖరారవుతుంది.
ఈ నెల 26వ తేదీన ఏడో వేతన సవరణ సంఘం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ (JCM) ప్రతినిధులు సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది వరకు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల వరకు ఉన్న పింఛన్దారులకు డీఏ, డీఆర్ బకాయిలపై ఈ సమావేశంలో చర్చిస్తామని జేసీఎం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, జేసీఎం ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు.

గత ఏడాది జనవరి 1, అదే ఏడాది జులై 1, ఈ ఏడాది జనవరి 1వ తేదీల నుంచి చెల్లించాల్సిన బకాయిలపై సమగ్రంగా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఏడో పే కమిషన్ సిఫారసుల ప్రకారం.. ఉద్యోగుల మూల వేతనంలో నాలుగు శాతం మేర పెంపు ఉంటుందంటూ జేసీఎం ఇదివరకే అంచనా వేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల ఏప్రిల్ చివరివారంలో ప్రకటించాల్సిన డీఏ పెంపుదలను తొలుత మే, ఆ తరువాత జూన్కు వాయిదా వేసినట్లు ఆయా శాఖల అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు మిశ్రా పేర్కొన్నారు. అయినప్పటికీ మళ్లీ వాయిదా పడిందని చెప్పారు.
డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసిందని, ఈ ఏడాది జూన్ లేదా జులైల్లో డీఏను పునరుద్ధరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రాజ్యసభలో హామీ సైతం ఇచ్చిందని మిశ్రా గుర్తు చేశారు. వాటికి కేంద్రం కట్టుబడి ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి అధికారిక భేటీకి సంబంధించిన అజెండాను ఇంకా నిర్ధారించలేదని పేర్కొన్నారు. గత ఏడాది జులై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ద్రవ్యోల్బణం 3.5 శాతంగా నమోదైందని, దీన్ని ఆధారంగా చేసుకుంటే.. డీఏ పెంపు కనీసం నాలుగు శాతంగా ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నట్లు శివ గోపాల్ మిశ్రా తెలిపారు.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

Gold rates: వరుస లాభాలకు బ్రేక్.. ఈ రోజు బంగారం ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications