ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ సందర్భంగా బంపరాఫర్!
హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు హోలీ బోనాంజా బహుమతిని ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం కింద రూ.10,000 అడ్వాన్స్ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం పొందేందుకు చివరి తేదీ మార్చి 31. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. మూడో ఇన్స్టాల్మెంట్ ఎర్రీర్స్ను విడుదల చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనం 30 శాతం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61కి పెంచనుంది.
త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ హైక్ను ప్రకటించింది. ఇదొక్కటే కాదు పెన్షనర్స్ 3 శాతం డీఏ హైక్ పొందనున్నారు. అలాగే, గత జూలై నుండి పెండింగ్లో ఉన్న డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ (DR)కు సంబంధించిన శుభవార్త చెప్పింది.