COVID 19: తప్పదు.. పర్సనల్ లోన్ తీసుకుంటాం, అవన్నీ తగ్గిస్తాం: సర్వేలో షాకింగ్
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది వృత్తి నిపుణులు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాలపై తీవ్ర ఆందోళనతో ఉన్నారని ప్రముఖ డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ ఇండియా లెండ్స్ సర్వేలో వెల్లడైంది. కరోనా కారణంగా తీవ్రఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చునని చాలామంది చెప్పారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 5,000 మంది వేతనజీవులు పాల్గొన్నారు. ఈ సర్వేలో ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి.
ఇన్ఫోసిస్లో 74 మంది కోటీశ్వరులు, వారికి ప్రమోషన్లు లేవు
ఖర్చులు తగ్గించుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం
82 శాతం మంది తమ కమిట్మెంట్స్ను తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
94 శాతం మంది రాబోయే రోజుల్లో డబ్బులను ఎలా ప్లాన్గా ఖర్చు చేసుకోవాలనే అంశంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
84 శాతం మంది తాము ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
90 శాతం మంది తమ పొదుపు, ఆర్థిక భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రుణాలు చెల్లించలేక.. పర్సనల్ లోన్
తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు, నిత్యావసరాలు, వైద్య, విద్య ఫీజులు, ఇంటి మరమ్మతులు, పునరుద్ధరణ వంటి ఖర్చుల కోసం తాము పర్సనల్ లోన్ తీసుకుంటామని 72 శాతం మంది చెప్పారు.
ఇందులో 71 శాతం మందికి ఇప్పటికే రుణాలు ఉండటం గమనార్హం.
45 శాతం మంది రుణాలు చెల్లించలేక మారటోరియం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రిటైల్ రుణాలకు గిరాకీ పెరుగుతోంది.
76 శాతం మంది కొత్త పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని చెప్పారు.
ఎసెన్షియల్ ఐటమ్స్ పైన ఖర్చులు పెరుగుతాయని 40 శాతం మంది చెప్పారు.
వినోదం, లగ్జరీ, లైఫ్ స్టైల్ వంటి అనవసర ఖర్చులపై ఖర్చులు తగ్గిస్తామని 70 శాతం మంది చెప్పారు. అంటే సినిమాలు, టూర్లు వంటి వాటిపై ఖర్చులు తగ్గించే అవకాశముంది.
రిటైల్ రుణాలకు గిరాకీ
కరోనా మహమ్మారి మనమంతా పని చేసే విధానాన్ని మార్చి వేసిందని, వేతనజీవులు, వృత్తి నిపుణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఇండియా లెండ్స్ వ్యవస్థాపకులు, సీఈవో గౌరవ్ చోప్రా వెల్లడించారు. కొంతమంది తమ ఉద్యోగాలు కోల్పోతే, ఎక్కువమందికి వారి వారి కంపెనీలు వేతనాల్లో కోత విధించినట్లు తెలిపారు. వారి ఆదాయం, పొదుపుపై ప్రభావం పడతోందని, దీంతో రిటైల్ రుణాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు.
రుణ ఎంపికపై జాగ్రత్తగా ఉండాలి
ఆర్థిక విస్తరణ, ఆస్తులు సులభంగా అందుబాటులోలేని ఈ పరిస్థితుల్లో వ్యక్తులు వారి రుణ ఎంపికపై జాగ్రత్తగా ఉండాలని, ముందు ముందు ఎన్ని వారాలు, నెలలు పరిస్థితి ఎలా ఉంటుందో గమనించి ప్రణాళిక ప్రకారం, వ్యక్తిగత రుణం లేదా లైన్ ఆఫ్ క్రెడిట్ వైపు దృష్టి సారించాలని గౌరవ్ చోప్రా వెల్లడించారు.
రుణగ్రహీతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ లెండర్ అప్లికేషన్ ఫామ్స్ ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు తెలిపారు.