71 హాస్పిటల్స్, 5వేల ఫార్మసీలు.. 92 ఏళ్ల అతని ఆలోచన దేశ ఆరోగ్య రంగాన్నే మార్చేసింది.

దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ నెట్‌వర్క్‌ను స్థాపించిన ఆదర్శనీయుడి కృషి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్నే మార్చేసింది. ఆయనే డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులోనే ఉంటారు. వారానికి ఆరు రోజులు పని చేసే డాక్టర్ రెడ్డిని చూస్తే ఆయన వయస్సు తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు.

71 hospitals 5000 pharmacies 92 years old man thought changed entire indias health sector

నేటికీ డాక్టర్ రెడ్డిలో ఉన్న శక్తి, పని పట్ల ఆయనకున్న అంకితభావం ఒక యువకుడికీ ఎ మాత్రం తక్కువ కాదు. ఆరోగ్య సేవ తనకు ఎంతో ఇష్టమని, దానిని నిరంతరం మెరుగుపరచాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటుంటారు. 1983లో దేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ అయిన అపోలో హాస్పిటల్స్‌ను ప్రారంభించిన ఘనత డాక్టర్ రెడ్డిదే. అప్పట్లో మన దేశంలో సరైన ఆరోగ్య సౌకర్యాలు లేక చాలామంది చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది.

దింతో దేశంలోనే ప్రపంచ స్థాయి చికిత్సా సౌకర్యాలను అందించాలని డాక్టర్ రెడ్డి బలంగా అనుకున్నారు. ఆయన ఆలోచన భారతదేశ ఆరోగ్య రంగాన్ని శాశ్వతంగా మార్చేసింది. చెన్నైలో జన్మించిన డాక్టర్ రెడ్డి స్టాన్లీ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో కార్డియాలజిస్ట్‌గా ట్రైనింగ్ పొందారు. 1970లో తన తండ్రి నుండి వచ్చిన ఒక లేఖతో ఆయనను భారతదేశానికి తిరిగి వచ్చేలా చేసింది. 1979లో సరైన ట్రీట్మెంట్ లభించక ఒక రోగి మరణించడం డాక్టర్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘటనతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. చికిత్స లేకపోవడం వల్ల ఇకపై ఎవరూ చనిపోకూడదనేది ఆయన ముఖ్య ధ్యేయం.

నేడు అపోలో హాస్పిటల్స్ కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, అదొక భారీ ఆరోగ్య సంరక్షణ సామ్రాజ్యం. అపోలో నెట్‌వర్క్‌కు దేశవ్యాప్తంగా 71 ఆసుపత్రులు 5 వేల కంటే ఎక్కువ ఫార్మసీలు, 291 ప్రైమరీ హెల్త్ కేర్ క్లినిక్‌లు, ఒక డయాగ్నస్టిక్ నెట్‌వర్క్ ఇంకా ఒక అత్యాధునిక డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ ఉన్నాయి. ఈ బృందం దేశంలోని ప్రతి మూలకూ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తోంది. ఈ సౌకర్యాలను అపోలో గ్రూప్ ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. అపోలో హాస్పిటల్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.70 వేల కోట్లకు పైగా ఉంది. సి రెడ్డి కుటుంబానికి ఇందులో 29.3% వాటా ఉంది. ఫోర్బ్స్ ప్రకారం, డాక్టర్ రెడ్డి మొత్తం సంపద రూ.26,560 కోట్లు. అంత సంపద ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతారు.

విజయం మనల్ని మార్చాలని, దేశం కోసం మరింతగా పనిచేయడానికి ప్రేరణనివ్వాలని డాక్టర్ రెడ్డి బలంగా నమ్ముతారు. బిజినెస్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "మన విజయాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలి' అని అన్నారు. 92 ఏళ్ల వయసులో కూడా డాక్టర్ రెడ్డి చూపించే ఉత్సాహం, ఆయన నాయకత్వం నిజంగా ప్రశంసనీయం. ఆయన జీవితం నుండి మనం నేర్చుకునే గొప్ప విషయం ఏమిటంటే మీకు ఏదైనా సాధించాలనే బలమైన పట్టుదల ఉంటే, మీ కలలు, లక్ష్యాలను చేరుకోవడానికి వయస్సు ఎప్పుడూ అడ్డురాదు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+