Low Salaries: చిన్న హోటల్లో పనిచేసే వంట మాస్టర్ కూడా రోజుకు కనీసం వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న రోజులు ఇవి. కానీ.. వైట్ కాలర్ ఉద్యోగులకు అందుతున్న జీతాలు ఎంత దారుణంగా ఉన్నాయో గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఆఫీసుకు వెళ్లి వైట్ కాలర్ వర్క్ చేసే చాలా మంది ఉద్యోగులు తక్కువ సంపాదిస్తున్నారనే గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 65 శాతం మంది భారతీయుల సగటు జీతం కేవలం రూ.15,000గా ఉందని తాజా నివేదికలో వెల్లడైంది.

భారతీయుల జీతం..
దేశంలోని వైట్ కాలర్ కార్యాలయ ఉద్యోగులుగా పిలవబడే మూడింట రెండు వంతుల మంది నెలకు రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ సంపాదిస్తున్నారు. శాలరీ మేనేజ్ మెంట్ యాప్ శాలరీ బాక్స్ విడుదల చేసిన సర్వేలో 65% మంది భారతీయులు యావరేజ్ గా కేవలం రూ.15,000 సంపాదిస్తున్నట్లు తేలింది. కంపెనీలు సెంట్రల్ పే కమిషన్ నిర్ణయించిన కనీస వేతనాన్ని మాత్రమే చెల్లిస్తున్నందున.. దేశవ్యాప్తంగా 850 జిల్లాల్లో పనిచేస్తున్న పది లక్షల మందికి పైగా ఉద్యోగులు నెలకు రూ.18 వేలు మాత్రమే జీతంగా అందుకుంటున్నారు.

స్రీ,పురుషుల జీతాలు..
దేశంలో చాలా మంది మహిళలు యావరేజ్ గా రూ.12,398; పురుషులు సగటున రూ.15,000 సంపాదిస్తున్నారని నివేదిక పేర్కొంది. భారతదేశానికి సంబంధించి శ్రామిక శక్తిలో 27 శాతం మాత్రమే మహిళలు ఉండగా.. మిగిలిన 73 శాతం మంది పురుషులు ఉన్నారు. శ్రామికశక్తిలో 15 శాతం కంటే తక్కువ మంది నెలకు రూ. 20,000-40,000 (సగటున రూ. 25,000) మధ్య సంపాదిస్తున్నారు. మెజారిటీ భారతీయులు నివసించడానికి సరైన స్థలం పొందడంలో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నివేదిక తెలిపింది.

వారి జీతం రూ.9,000 మాత్రమే..
సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, టెక్స్టైల్ దుకాణాలు మొదలైన వాటిలో పనిచేసే ఉద్యోగులకు కేవలం రూ.8,000 నుంచి రూ.9,000 వేతనంగా పొందుతున్నారు. ఇదే సమయంలో.. రవాణా, ఐటీ కంపెనీలు, టైలరింగ్ కంపెనీలు కాస్త ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయని వెల్లడైంది.

దారుణంగా ఫ్రెషర్స్ జీతాలు..
వర్క్ఫోర్స్లోకి ప్రవేశించే యువకుల నెలవారీ జీతం చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ద్రవ్యోల్బణ సమయంలో మెజారిటీ ఎంట్రీ లెవల్ ఉద్యోగులు ఈ జీతాలతో కుటుంబాలను పోషించటం కష్టంగా మారిందని అంటున్నారు. వీరి పరిస్థితి కనీసం రోడ్డు పక్కడ పండ్ల వ్యాపారికంటే దారుణంగా ఉంది. వారి ఆదాయంలో ఉద్యోగుల జీతం సగమేనని నిపుణులు అంటున్నారు.

యువ పారిశ్రామికవేత్తలు..
ఇలాంటి కారణాల వల్ల నేటి తరం యువతలో కంపెనీల్లో నెలవారీ జీతాలకు పని చేయాలనే ఆసక్తి తగ్గిపోయిందని తెలుస్తోంది. అందుకే.. చాలా మంది రిస్క్ తీసుకుని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికైనా కనీసం చెల్లించే వేతనాలు అవసరాలను తీర్చేవిగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు సైతం వీటిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications