అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & సెజ్తో సహా ఆరు అదానీ గ్రూప్ స్టాక్లు కీలకమైన హిండెన్బర్గ్ నివేదిక తర్వాత భారీగా పడిపోయాయి. ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ మళ్లీ సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇతర నాలుగు స్టాక్లు అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మర్, ఎన్డిటివి ఇప్పటికీ హిండెన్బర్గ్ పూర్వ స్థాయిల కంటే దిగువన ట్రేడవుతున్నాయి.
అదానీ టోటల్ గ్యాస్ దాని ప్రీ-హిండెన్బర్గ్తో పోలిస్తే 74 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 59 శాతం, అదానీ విల్మార్ 35 శాతం, ఎన్డీటీవీ 11 శాతం తగ్గాయి. గడిచిన రెండు సెషన్లలో అదానీ గ్రూప్ స్టాక్స్లో ర్యాలీ కారణంగా గ్రూప్ స్టాక్ల మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. గత సంవత్సరం నుంచి నేటి వరకు, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ 40 శాతం, అదానీ పవర్ లిమిటెడ్ 35 శాతం
పెరిగాయి.

అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఈ ఏడాది 20 శాతం పెరిగాయి. అదానీ చేరిక సెన్సెక్స్ వాల్యుయేషన్ను పెంచగలదుని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టాక్ 57x ఫార్వర్డ్ P/E మల్టిపుల్తో ట్రేడవుతోంది. విశ్లేషకులు అదానీ ఎంటర్ప్రైజెస్కు 30% అప్సైడ్ను అంచనా వేస్తున్నారు. నిఫ్టీ50 ఇండెక్స్లో అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నప్పటికీ, సెన్సెక్స్లో చేర్చడం వల్ల అదానీ ఎంటర్ప్రైజెస్ పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
అంబుజా సిమెంట్స్ 25 శాతం, అదానీ ఎంటర్టైన్మెంట్ 20 శాతం పెరిగాయి. జనవరి 24, 2023న, హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిప్యులేషన్ మరియు అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ, అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదించిన రూ. 20,000 కోట్ల షేర్ విక్రయానికి ముందు ఒక నివేదికను ప్రచురించింది. దీంతో ఆదాని స్టాక్ ల్లో భారీగా ప్రెషర్ కనిపించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications