5 years of Demonetisation: రూ.2000 నోట్ల ప్రింటింగ్ లేదు, డిజిటల్ చెల్లింపు పెరిగినా...

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి నేటికి అయిదేళ్లు. నల్లధనం రూపుమాపడానికి, అదే విధంగా నోట్ల చలామణిని తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచే లక్ష్యంతో ఈ ప్రకటన వచ్చింది. ఈ అయిదేళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. అదే సమయంలో నోట్ల చలామణి కూడా పెరగడం గమనార్హం. నగదు ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పటికీ డిజిటల్ చెల్లింపులతో పోలిస్తే మాత్రం వీటి వినియోగ వృద్ధి భారీగా తగ్గింది. అయిదేళ్ల క్రితం అప్పుడు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో మాత్రం గణనీయ వృద్ధి సాధించింది భారత్. గత అయిదేళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వార్షిక సగటు వృద్ధి 55 శాతంగా ఉంది. గత ఏడాది కరోనా సమయంలో నగదు చలామణి పెరగడానికి వివిధ అంశాలు కారణం.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగం... నగదు వినియోగమూ అంతే

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగం... నగదు వినియోగమూ అంతే

గత ఆర్థిక సంవత్సరం ప్రజలు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని ప్రజలు తమ వద్ద నగదును అట్టిపెట్టుకున్నారు. కరోనా కారణంగా ఫిజికల్ కరెన్సీని తీసుకోవడానికి చాలామంది వెనుకాడారు. అందుకే క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌కు మొగ్గు చూపారు. డెబిడ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI వంటి డిజిటల్ చెల్లింపులు పెరిగాయి.

నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తీసుకు వచ్చిన యూపీఐకి ఆదరణ పెరిగింది. చెల్లింపులకు ప్రధాన సాధనంగా అత్యంత వేగంగా ఎదిగింది. డిజిటల్ చెల్లింపుల కోసం తీసుకు వచ్చిన UPI ద్వారా రూ.7.71 లక్షల కోట్ల విలువైన 421 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. పేటీఎం, ఫోన్‍‌పే, గూగుల్ పే వంటి యాప్స్‌తో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా వేగంగా పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం ఇంకా ఎక్కువే కనిపిస్తోంది.

రెండేళ్లు లేని రూ.2000 నోట్ల ముద్రణ

రెండేళ్లు లేని రూ.2000 నోట్ల ముద్రణ

2020-21 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న నగదు వ్యాల్యూ 16.8 శాతం, నోట్ల సంఖ్య 7.2 శాతం పెరిగాయి. 2019-20లో ఇవి వరుసగా 14.7 శాతం, 6.6 శాతం పెరిగాయి. 2014 అక్టోబర్ - 2020 అక్టోబర్ మధ్య కాలంలో చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య సగటున 14.51 శాతం పెరిగింది. రూ.500 లోపు ఉండే చెల్లింపుల్లో ఎక్కువ భాగం ఇప్పటికీ నగదు రూపంలోనే కొనసాగుతోంది.

UPI ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే రూ.7.71 లక్షల కోట్లు. 2021 మార్చి 31వ తేదీ నాటికి మొత్తం నగదులో రూ.500, రూ.2000 నోట్ల వ్యాల్యూ 85.7 శాతం, 2020 మార్చి 30వ తేదీ నాటికి 83.4 శాతం. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో రూ.2000 నోట్ల ముద్రణ లేదు.

నగదు చలామణి...

నగదు చలామణి...

నోట్ల రద్దు చేయడానికి ముందు.. నవంబర్ 4, 2016 నాటికి చలామణిలో ఉన్న నగదు రూ.17.74 లక్షల కోట్లు. 2021 అక్టోబర్ 29వ తేదీ నాటికి ఇది రూ.29.17 లక్షల కోట్లకు పెరిగింది.

2020 అక్టోబర్ 30 నాటికి రూ.26.88 లక్షల కోట్ల విలువైన నగదు చలామణిలో ఉండగా, ఈ ఏడాదిలో ఇది రూ.2,28,963 పెరిగింది. అదే సమయంలో 2019 అక్టోబర్ నుండి 2020 అక్టోబర్ 29 నాటికి రూ.4,57,059 కోట్ల విలువైన నోట్లు చలామణిలోకి వచ్చాయి. అంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం దాదాపు సగం తగ్గింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+