పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి: విచక్షణారహితంగా కాల్పులు, ఐదుగురి మృతి!

కరాచీ: పాకిస్తాన్‌లో స్టాక్ మార్కెట్ కార్యాలయంలో సోమవారం రోజు ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బిల్డింగ్‌లో జరిగిన ఈ దాడిలో నలుగురైదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఘటన అనంతరం స్టాక్ మార్కెట్ సిబ్బందిని భవనం నుంచి ఖాళీ చేయించారు. భద్రతా బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి.

పాక్ మీడియా సమాచారం మేరకు పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలోకి ఉగ్రవాదులు జొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో నలుగురి నుండి ఐదుగురు మృత్యువాత పడగా, పలువురికి గాయాలయ్యాయి.

 5 dead as armed men storm Pakistan Stock Exchange building

ఉగ్రవాదులు తొలుత భవనం వెలుపల గ్రెనేడ్ విసిరి, ఆ తర్వాత లోపలికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడ్డాడు.
పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ భవంతిని సీల్ చేశారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+