ఇండియాలో క్రికెట్ ప్లేయర్స్ కి, క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే తాజా పరిశోధనలో బాలీవుడ్ స్టార్ల కంటే క్రికెటర్లే ఎక్కువ పాపులర్ సెలబ్రిటీలుగా నిలుస్తున్నారు.హంసా రీసెర్చ్ బ్రాండ్ ఎండోర్సర్ రిపోర్ట్ 2024 ప్రకారం, క్రికెటర్లు భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ హీరోలను సైతం అధిగమించారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ స్టార్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా బ్రాండ్ ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్నారు.
2024లో 42 బ్రాండ్లతో (మొదటి ఆరు నెలల్లో) ధోనీ 41 బ్రాండ్లతో ఉన్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ను కూడా అధిగమించి టిప్ బ్రాండ్ ప్రమోటర్గ్ కోనసాగుతున్నారు. TAM మీడియా రీసెర్చ్ నివేదిక ప్రకారం యూరోగ్రిప్ టైర్స్ మహీంద్రా సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్గా చేయడంతో బుధవారం ధోని టాప్ ప్లేస్లోకి మార్చింది.

ఈ సంవత్సరం ధోనీ ఫ్రెంచ్ కార్మేకర్ సిట్రోయెన్, డ్రోన్ టెక్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్, ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలోని క్లియర్ట్రిప్, పెప్సికో లేస్, క్రాస్-రివార్డ్ ప్రోగ్రామ్ ఆపరేటర్ Single.id, ఇ-సైకిల్ కంపెనీ EMotorad, ఫ్యూయల్ కార్డ్ సర్వీసెస్ ఇంకా ఆయిల్, కన్స్యూమర్ ఎలక్ట్రికల్ బ్రాండ్ ఓరియంట్ ఎలక్ట్రిక్, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ బ్రాండ్ ఎక్స్ప్లోజివ్ వేకి బ్రాండ్ ప్రమోటర్ గా ఉన్నారు.
ధోనీ ప్రొడక్ట్స్ కోసం మాత్రమే కాదు ఎన్నికల సందర్భంగా ఎన్నికలు, ఓటింగ్ పై కూడా ప్రజలకు అవగాహణ కల్పిస్తూ జార్ఖండ్ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ తో పనిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత కూడా ధోని బ్రాండ్ వాల్యూ పెరుగుతోంది" అని TVS శ్రీచక్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మాధవన్ పార్థసారథి అన్నారు.
యూరోగ్రిప్ వంటి బ్రాండ్తో అనుబంధం కావడం నిజంగా ఆనందంగా ఉంది. బైక్స్ ఇంకా బైక్ రైడింగ్పై నా ఇష్టం నా క్రికెట్ ప్రయాణానికి చాలా కాలం ముందు ప్రారంభమైంది ఇంకా సంవత్సరాలుగా టైమ్లెస్ క్లాసిక్ల నుండి టాప్-ఆఫ్-లైన్ సూపర్బైక్ల వరకు రకరకాల బైక్లను నడిపే అవకాశం నాకు లభించింది అని అన్నారు.
TAM మీడియా రీసెర్చ్ ప్రకారం, ధోని బ్రాండ్ ఎండార్స్మెంట్లలో పెరుగుదల అద్భుతంగా ఉంది, కేవలం అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా 34 బ్రాండ్లతో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, 31 బ్రాండ్లతో కరీనా కపూర్ని కూడా అధిగమించాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలు వెనుకంజలో ఉన్నప్పటికీ అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి స్క్రీన్ టైమ్లో ధోని ఇప్పటికీ సగటున రోజుకు 16 గంటల పాటు . స్క్రీన్ మీద వివిధ యాడ్స్ లో కనిపిస్తున్నాడట. అయితే ఐదేళ్ల కిందట ఇంటర్నేషనల్ క్రికెట్ కు ధోని .గుడ్బై చెప్పిన సంగతి మీకు తెలిసిందే.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications