Mudra loans: దేశ ఆర్థిక వృద్ధిలో గేమ్ ఛేంజర్స్ గా MSMEలు.. 8 ఏళ్లలో ఎంతమంది ముద్రా లోన్లు పొందారంటే..

Mudra loans: ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కింద 40.82 కోట్ల మంది లబ్ధి పొందినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24 నాటికి బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు 23.2 లక్షల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 7 నాటికి ఈ పథకం ప్రారంభించి 8 ఏళ్లు అయిన సందర్భంగా ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించారు.

వ్యవసాయ, కార్పొరేటేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఏప్రిల్ 8, 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముద్రా రుణాలను ప్రవేశపెట్టారు. 10 లక్షల వరకు తనఖా అవసరం లేకుండా, సులువుగా రుణాలు అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. PMMY కింద రుణాలను మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (MLI) అయిన బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), మైక్రోఫైనాన్స్ సంస్థలు (MFIలు) నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.

Mudra loans

PMMY లబ్ధిదారుల్లో 68 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 51 శాతం ఖాతాలు SC/ST, OBCలకు చెందినవేనన్నారు. దేశంలో ఔత్సాహిక వ్యాపారులకు క్రెడిట్ లభ్యతను సులభతరం చేయడం, కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టడం సహా తలసరి ఆదాయంలో స్థిరమైన పెరుగుదల సాధించడం కోసం ఈ రుణాలు తోడ్పాటు అందించాయంది.

MSMEల వృద్ధి మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావడానికి భారీగా దోహదపడినట్లు నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. దేశీయంగా తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఈ పరిశ్రమలు ఉత్పత్తిని పెంచాయన్నారు. అట్టడుగు స్థాయిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడానికి మార్గం సుగమం చేశాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో వీటిని గేమ్ ఛేంజర్స్ గా పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+