Trading News: బెంగళూరు ట్రేడర్.. ఇతనిలా మాత్రం అస్సలు ట్రేడింగ్ చేయకండి ప్లీజ్..!
Trading News: ఎంత ఇష్టమైన పనినైనా లిమిట్స్ లో ఉంచటం అన్ని విధాలా మంచిది. ఎందుకంటే ఏది అదుపుతప్పినా చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. అలా బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ట్రేడింగ్ విషయంలో చేసిన తప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అతిగా ట్రేడింగ్ చేయటం వల్ల బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఏకంగా రూ.30 లక్షలు నష్టపోయాడు. అయితే ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ లోని డి-అడిక్షన్ క్లినిక్ని సంప్రదించాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం కోసం తన వ్యసనాన్ని అధిగమించడానికి చికిత్స పొందారు. కుటుంబ సభ్యులు చికిత్స పొందవలసిందిగా కోరడంతో సర్వీస్ ఫర్ హెల్తీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ క్లినిక్ నిపుణులను సంప్రదించాడు.

జూదం లేదా గేమింగ్ వ్యసనం వంటి ఇతర కేసుల మాదిరిగా కాకుండా.. రోగి సమస్యను వివరంగా అర్థం చేసుకోవడం ద్వారా అతని పరిస్థితిని పరిష్కరించడానికి ఒక సరికొత్త విధానాన్ని అవలంబించాల్సి వచ్చిందని డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ వెల్లడించారు. గతంలో మార్కెట్లను సరిగ్గా అంచనా వేసిన అతడు ఆ తర్వాత భారీ నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. అయితే ట్రేడింగ్ లో మితిమీరిన ఆసక్తితో మెుత్తం సంపదను పోగొట్టుకున్నాడు.
స్టాక్ ట్రేడింగ్ అబ్సెషన్ చికిత్స తమకు చాలా సవాలుగా ఉందని ఒక సీనియర్ సైకాలజిస్ట్ చెప్పారు. ఇందులో రోగికి మందులు అవసరమయ్యే హఠాత్తుగా ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి దీనికి చాలా జాగ్రత్తగా, సమగ్రమైన విధానం అవసరమని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications