భారతదేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తుంటారు. ఇక్కడ ప్రతి గుడి ఒక దేవుని నివాసం మాత్రమే కాదు, భక్తుల భక్తి, విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణ. అందులోనూ హిందుమతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మవంటివి దేవాలయాలు. ఇక్కడి దేవాలయాలు కేవలం భక్తి స్థలాలే కాక, కళ, శిల్పకళ, ఆర్కిటెక్చర్ లో అద్భుతంగా నిలిచాయి. ప్రతి ఆలయం వెనుక ఒక పురాణ గాథ ఉంది, ప్రతి గోపురం వెనుక ఒక శిల్పకారుడి అద్భుత కళ ఉంది.

అందుకే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు, సందర్శకులు ఈ దేవాలయాలను దర్శించేందుకు తరలివస్తుంటారు. చిన్న గ్రామాల నుంచీ పెద్ద నగరాల వరకూ ప్రతిచోటా మనకు ఓ గుడి కనిపించకపోతే ఆశ్చర్యం అనిపించేదీ కాదు. ఆలయాల్లో జరిగే పూజలు, ఉత్సవాలు ఒక్క భక్తులకు మాత్రమే కాదు, చుట్టుపక్కల వారందరికీ ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మనం చూసే ఈ గొప్ప దేవాలయాలు, వాటి విశేష సంపద, అద్భుత శిల్పకళ ఇలా ఇవన్నీ భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో, ప్రాచీనమో మనకు గుర్తు చేస్తాయి. ఇప్పుడు మనం భారతదేశంలోని టాప్ 10 సంపన్న ఆలయాలను తెలుసుకుందాం
10. శ్రీ జగన్నాథ్ ఆలయం, పురీ, ఒడిశా
పురీలోని ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందింది. ఇది చార్ధామ్ యాత్రలో ఒక భాగంగా ఉన్న ఒక ప్రముఖ ఆలయం. దాదాపు రూ. 150 కోట్ల ఆస్తి విలువతో పాటు 30,000 ఎకరాల భూమిని కలిగి ఉంది.
9. సోమనాథ్ ఆలయం, గుజరాత్
సోమనాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో మొదటిది. ఈ ఆలయంలో 130 కేజీల బంగారం గర్భగుడిలో, మరొక 150 కేజీలు శిఖర భాగంలో ఉపయోగించబడింది. ఇది గుజరాత్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.
8. సిద్ధి వినాయక్ ఆలయం, ముంబై
ముంబైలోని ప్రసిద్ధయైన సిద్ది వినాయకుని ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న వినాయకుడి ఆలయాల్లో ఒకటి. ఆలయ విగ్రహం 4 కిలోల బంగారంతో అలంకరించబడి ఉంటుంది. ప్రతిరోజూ భక్తుల నుంచి సగటున రూ.30 లక్షల విలువైన హుండీ దానాలను స్వీకరిస్తోంది. మొత్తం ఆలయం ఆస్తుల విలువ సుమారుగా రూ.125 కోట్లుగా అంచనా వేయబడింది.
7. మీనాక్షి ఆలయం, మదురై
తమిళనాడులోని మదురైలో ఉన్న ఈ ఆలయం అందమైన నిర్మాణశైలి, శిల్పకళ, ద్రవిడ శైలి గోపురాల వల్ల ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు 20,000 మందికి పైగా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం సంవత్సరానికి దాదాపు రూ.6 కోట్ల ఆదాయం పొందుతోంది.
6. గోల్డెన్ టెంపుల్, అమృత్సర్
సిక్కు మతానికి ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ గోల్డెన్ టెంపుల్, 1581లో నిర్మించబడింది. స్వర్ణపటంతో అలంకరించబడిన ఈ ఆలయం సంవత్సరానికి సుమారు రూ.500 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది.
5. షిర్డీ సాయి బాబా ఆలయం, మహారాష్ట్ర
షిరిడి లో ఉన్న ఈ ఆలయం రోజూ సగటున 25,000 మంది భక్తులను ఆహ్వానిస్తుంది. 2022 లో హుండీ దానాల ద్వారా రూ.400 కోట్ల ఆదాయాన్ని స్వీకరిస్తుంది.
4. వైష్ణో దేవి ఆలయం, జమ్మూ & కాశ్మీర్
దుర్గాదేవి అవతారంగా భావించబడే వైష్ణో దేవికి అంకితమైన ఈ ఆలయం జమ్మూ ప్రాంతంలోని 5,200 అడుగుల ఎత్తులో ఉంది. 2000 నుండి 2020 మధ్య, భక్తులు ఈ ఆలయానికి దాదాపు 1,800 కేజీల బంగారం, 4,700 కేజీల వెండి, మరియు రూ.2,000 కోట్ల నగదును దానంగా సమర్పించారు. ఇది దేశంలో ధనిక ఆలయాల్లో ఒకటిగా నిలిచింది.
3. గురువాయూర్ దేవస్థానం, కేరళ
విష్ణువు స్వరూపమైన గురువాయురప్పన్కు అంకితమైన ఈ ఆలయం రూ.1,737 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు, 271 ఎకరాల భూమి, బంగారం, వెండి, రత్నాలను కలిగి ఉంది. ఇది కేరళలో అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి.
2. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ
ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన పద్మనాభస్వామి ఆలయం దాదాపు రూ.1.2 లక్షల కోట్ల విలువ గల ఆస్తులను కలిగి ఉంది. ఇందులో బంగారు ఆభరణాలు, వజ్రాలు, ప్రాచీన వెండి వస్తువులు, మరియు పచ్చ రత్నాల నిధి ఉంది.
1. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్
తిరుమల పర్వతాలపై కొలువు చెందిన ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. దీని నికర విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా అంచనా. రోజుకు సగటున 50,000 మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం, బంగారం, నగదు, మరియు ఇతర దానాలతో సంవత్సరానికి రూ.1,400 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications