Gold Rates: మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులు కొనసాగటం కూడా పసిడి పరుగులకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరలు చెన్నైలో రూ.56,650, ముంబైలో రూ.56,050, దిల్లీలో రూ.56,200, కోల్కత్తాలో రూ.56,050, బెంగళూరులో రూ.56,100, కేరళలో రూ.56,050, పూణేలో రూ.56,050, వడోదరా రూ.56,100, కోయంబత్తూర్ రూ.56,650, మైసూర్ రూ.56,100, వెల్లూరులో రూ.56,450గా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు దాదాపు రూ.200 బంగారం విక్రయ ధరలు పెరిగాయి.

ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల ధరలు చెన్నైలో రూ.61,800, ముంబైలో రూ.61,150, దిల్లీలో రూ.61,310, కోల్కత్తాలో రూ.61,150, బెంగళూరులో రూ.61,200, కేరళలో రూ.61,150, పూణేలో రూ.61,150, వడోదరా రూ.61,200, కోయంబత్తూర్ రూ.61,800, మైసూర్ రూ.61,200, వెల్లూరులో రూ.61,800గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్వచ్ఠమైన 24 క్యారెట్ల గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. హైదరాబాదులో రూ.61,150గా ఉండగా.. విజయవాడలో రూ.61,150గా ఉన్నాయి. ఏపీలోని విశాఖ, అమరావతి, నెల్లూరు, కాకినాడ, కడప, తిరుపతి, అనంతపురం నగరాల్లో ధర రూ.61,150 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో సైతం ధర రూ.61,150 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications