2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మానవ చరిత్రలో ఈ ఏడాదిని 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం'గా చెప్పకోవచ్చు. ఎందుకంటే.. ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే చూసిన హ్యూమనాయిడ్ రోబోలు, మన ఆలోచనలను పసిగట్టే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది నిజమయ్యాయి. గూగుల్, ఓపెన్ ఏఐ, టెస్లా వంటి దిగ్గజ సంస్థల మధ్య జరిగిన పోరు వల్ల సామాన్యులకు అద్భుతమైన టెక్నాలజీ పరిచయమైంది. మరి 2025 లో ఏఐ రంగంలో జరిగిన ఆ ఆసక్తికర పరిణామాలు ఏంటో ఓసారి చూద్దామా?

ప్రారంభం నుంచే ఏఐ హోరు!
ఈ ఏడాది జనవరిలో చైనాకు చెందిన 'డీప్సీక్' (DeepSeek-R1) మోడల్తో సంచలనం మొదలైంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ రీజనింగ్ సామర్థ్యాన్ని చూపిస్తూ అమెరికా కంపెనీలకు సవాలు విసిరింది. ఫిబ్రవరిలో ప్యారిస్లో జరిగిన 'ఏఐ యాక్షన్ సమ్మిట్'లో మన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కలిసి ఏఐ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఓపెన్ ఏఐ తన 'GPT-4.5' వెర్షన్ను విడుదల చేసి మల్టీమోడల్ స్కిల్స్ (వాయిస్, టెక్స్ట్, ఇమేజ్) లో తన సత్తా చాటింది.
హ్యూమనాయిడ్ రోబోలు
2025 లో రోబోటిక్స్ రంగం ఊహించని మలుపు తిరిగింది. గూగుల్ డీప్మైండ్ 'జెమిని రోబోటిక్స్'ను తీసుకురాగా.. ఇది భౌతిక ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకునే స్థాయికి చేరింది.
• టెస్లా ఆప్టిమస్ (Tesla Optimus): ఎలన్ మస్క్ తన హ్యూమనాయిడ్ రోబోలను పైలట్ ప్రొడక్షన్ స్థాయికి తెచ్చారు. ఏడాది చివరి నాటికి 5,000 రోబోలను సిద్ధం చేయాలనే లక్ష్యానికి దగ్గరయ్యారు.
• మనుస్ (Manus AI): ఎటువంటి మనిషి పర్యవేక్షణ లేకుండానే పనులు పూర్తి చేసే అటానమస్ ఏఐ ఏజెంట్గా 'మనుస్' గుర్తింపు పొందింది.
GPT-5.. జెమిని 3 మధ్య పోరు
మిడ్-ఇయర్లో టెక్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. ఆంత్రోపిక్ 'క్లాడ్ 4'ను విడుదల చేయగా.. గూగుల్ తన 'జెమిని 2.5', 'ఫ్లాష్' మోడళ్లతో కౌంటర్ ఇచ్చింది. ఆగస్టులో ఎంతో కాలంగా వేచి చూస్తున్న 'GPT-5'ని ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. అయితే నవంబర్లో గూగుల్ విడుదల చేసిన 'జెమిని 3' (Gemini 3) తన అడ్వాన్స్డ్ రీజనింగ్ సామర్థ్యంతో ఏఐ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
డిస్నీ - ఓపెన్ ఏఐ బిలియన్ డాలర్ డీల్
డిసెంబర్ మాసంలో ఒక భారీ ఒప్పందం కుదిరింది. వాల్ట్ డిస్నీ కంపెనీ తన 200లకు పైగా ఫేమస్ క్యారెక్టర్లను ఓపెన్ ఏఐ 'సోరా' (Sora) కి లైసెన్స్ ఇచ్చింది. ఇందుకోసం సుమారు రూ. 8,300 కోట్ల (1 బిలియన్ డాలర్లు) డీల్ జరిగింది. దీనివల్ల మనకు నచ్చిన డిస్నీ క్యారెక్టర్లతో మనం ఏఐ ద్వారా కొత్త వీడియోలను క్రియేట్ చేసే అవకాశం రాబోతోంది.
చౌకైన టెక్నాలజీ: ఫోటోనిక్ చిప్స్
ఏఐ రన్ అవ్వడానికి విద్యుత్ ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనికి పరిష్కారంగా ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు 'ఫోటోనిక్ ఏఐ చిప్'ను తయారు చేశారు. ఇది విద్యుత్తుకు బదులుగా కాంతిని (Light) వాడుకుని పనిచేస్తుంది. దీనివల్ల ఏఐ ప్రాసెసింగ్ ఖర్చు భారీగా తగ్గనుంది. చైనాకు చెందిన డీప్సీక్ కూడా 70 శాతం తక్కువ ఖర్చుతో తన మోడల్స్ ట్రైన్ చేసి అబ్బురపరిచింది.
ఏదేమైనా.. 2025 సంవత్సరం ఏఐ కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదని, అది రోబోల రూపంలో మన ఇంట్లోకి కూడా రాబోతోందని నిరూపించింది. ఎలన్ మస్క్ 'గ్రోక్' (Grok), అమెజాన్ 'నోవా 2.0' వంటి మోడల్స్ కూడా ఈ రేసులో ఉండటంతో 2026 మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?



Click it and Unblock the Notifications