ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.35 నిమిషాలకు సెన్సెక్స్ 120 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో ట్రేడ్ అయింది. సాయంత్రం గం.3.40 సమయానికి సెన్సెక్స్ 38.44 (0.098%) పాయింట్లు నష్టపోయి 39,020.39 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 21.50 (0.19%) పాయింట్లు నష్టపోయి 11,582.60 వద్ద ట్రేడ్ అయింది.
రెండు రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పటికీ, హర్యానాలో హంగ్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఉదయం రెండు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ఉంటుందని భావించడంతో మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమైనట్లుగా ఉంది. కానీ ఆ తర్వాత ట్రెండ్స్ మారిపోయాయి. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

టాప్ గెయినర్స్లో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఐచర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ కంపెనీ ఉండగా, టాప్ లూజర్స్లో భారతీ ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, గ్రాసిమ్, ఎస్బీఐ, గెయిల్ ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా నష్టపోయాయి.
మిడ్ క్యాప్ సూచీ 0.2 శాతం, స్మాల్ క్యాప్సూచీ 0.01 శాతం పడిపోయాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆరు శాతం లాభపడింది. కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో ట్రేడ్ అయింది. లైఫ్ టైమ్ హైలో ఈ షేర్ ట్రేడ్ అవుతోంది. భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు ఐధు శాతం వరకు నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications