స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC) వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకు (PSB) దీపావళి పండుగ సందర్భంగా తమ ఉద్యోగులకు ఫెస్టివెల్ గిఫ్ట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఈ రెండు బ్యాంకులు కూడా ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.1,000 విలువ కలిగిన మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఇస్తున్నట్లు తెలిపాయి. దీపావళి పండుగ బహుమతిగా ఉద్యోగుల చేతికి డబ్బులు ఇవ్వవద్దని, పైవాటిలో ఏవైనా ఇవ్వవచ్చునని సూచించాయి.
బ్యాంకుల్లోని కాంపిటెంట్ అథారిటీ ఇప్పటికే దీపావళి గిఫ్ట్ల డిస్ట్రిబ్యూషన్కు సంబంధించిన నిబంధనలను జారీ చేసింది. స్వీట్స్, డ్రైఫ్రూట్స్, చాక్లెట్స్ రూపంలో అందించే ఈ గిఫ్ట్ల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని రూ.2019-20 స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్, సంబంధిత బ్యాంకు అకౌంట్స్ నుంచి కట్ చేస్తారు.

OBC జనరల్ మేనేజర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ స్వరూప్ కుమార్ సాహా మాట్లాడుతూ 2019-20 రెండో త్రైమాసికంలో బ్యాంకు మెరుగైన పని తీరు కనబరిచిందన్నారు. ఓబీసీ రూ.126 కోట్ల నికర లాభం ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23.53 శాతం పెరుగుదల నమోదయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 20.99 శాతం పెరిగింది. ఓబీసీ ఉద్యోగులకు దీపావళి బహుమతులు అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరోవైపు, SBI తన ఉద్యోగులకు రెండోసారి దీపావళి సందర్భంగా గిఫ్ట్స్ ఇస్తోంది. ఎస్బీఐలో 2,57,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ గిఫ్ట్ల విలువ రూ.25.7 కోట్లు కానుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications