లాభాల్లో స్టాక్ మార్కెట్లు: 250 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (15 అక్టోబర్) లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.48 నిమిషాలకు సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ 70.58 వద్ద ఉంది. అంతకుముందు రోజు (సోమవారం) రూపాయి 71.23 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ మధ్యాహ్నం 1.01 సమయానికి 255.04 (0.67%) పాయింట్ల లాభంతో 38,469.51వద్ద, నిఫ్టీ 73.15 (0.64%) పాయింట్ల లాభంతో 11,414.30 వద్ద ట్రేడ్ అయింది.
ఏపీ రైతులకు గుడ్న్యూస్: రూ.1000 పెంపు, దరఖాస్తు చివరి తేదీ.
ఐవోసీ, హెచ్యూఎల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, బ్రిటానియా, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. లోహ రంగం మినహా మిగతా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటో కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి.