ముంబై: IRCTC ఐపీవో లిస్టింగ్ నేటి నుంచి (అక్టోబర్ 14) ప్రారంభమైంది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ అదరగొట్టింది. రికార్డ్ స్థాయిలో రెండింతలకు పైగా పెరిగింది. ట్రేడింగ్ మొదలు కాగానే 101 శాతం పెరిగి రూ.644 ధరతో లిస్ట్ కావడం గమనార్హం. ఆ తర్వాత 118 శాతం పెరిగిన షేర్ రూ.698 వరకు కూడా చేరుకుంది. IRCTC ఐపీవో షేర్ ధర రూ.315-320గా నిర్ణయించారు. రూ.320 ధరతో షేర్ సోమవారం లిస్ట్ అయింది. షేర్ ధర ఒక్కసారిగా పెరగడంతో IRCTC మార్కెట్ విలువ రూ.10,9732 కోట్లకు ఎగబాకింది.

గత రెండేళ్లలో IRCTCనే...
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వం IRCTC ఐపీవో తీసుకు వచ్చింది. దీని ద్వారా రూ.645 కోట్లు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవోకు వచ్చిన రైల్వేలకు చెందిన నాలుగో కంపెనీ IRCTC. ఇదివరకు IRCTC, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్సీవోఎన్లు పబ్లిక్ ఆఫర్లకు వచ్చాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ మధ్య ఐఆర్సీటీసీకి 112 రెట్ల స్పందన వచ్చింది. గత రెండేళ్లలో లిస్ట్ అయిన ఐపీవోలలో IRCTC రాకెట్ వేగంతో దూసుకు వచ్చింది. అంతకుముందు కూడా పలు కంపెనీలు లిస్టింగ్ సమయంలో రెండింతల వేగంతో వచ్చాయి. ఇందులో బిర్లా పసిఫిక్, సలాసర్ టెక్నో, ఆస్ట్రోన్ పేపర్, అవెన్యూ సూపర్ మార్ట్, కెరీర్ పాయింట్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, బెడ్ ముతా ఇంద్, సీడీఎస్ఎల్ ఉన్నాయి.

లిస్టింగ్ రోజునే డబుల్కు పైగా పెరిగిన షేర్లు
- 07-07-2011న బిర్లా పసిఫిక్ రూ.10కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ సమయంలో రూ.10.10గా, క్లోజింగ్ సమయంలో రూ.25.35గా ఉంది. అంటే ఆ రోజున ఈ షేర్ 153.5 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.0.28గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 97 శాతం తగ్గింది.
- 25-07-2017న సలాసర్ టెక్నో రూ.108కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.259.45 కాగా, క్లోజింగ్ సమయంలో రూ.272.10గా ఉంది. అంటే 151.94 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.102.80గా ఉంది. ఇష్యూ నాటితో 4.81 శాతం తగ్గింది.
- 29-12-2017న ఆస్ట్రోన్ పేపర్ రూ.50కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.120.75 కాగా, క్లోజింగ్ 119.70గా ఉంది. అంటే లిస్టింగ్ రోజున లాభపడింది 139.4 శాతం. ప్రస్తుత ధర రూ.95.45గా ఉంది. ఇష్యూ నాటితో 90.90 శాతం పెరిగింది.
- 21-03-2017న అవెన్యూ సూపర్ మార్ట్ రూ.299కి ఇష్యూ చేయగా లిస్టింగ్ ఓపెనింగ్ రూ.604, క్లోజింగ్ రూ.640.75గా ఉంది. లిస్టింగ్ రోజున ఇది 114.3 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.1,821.60గా ఉంది. ఇష్యూ నాటితో 509.23 శాతం పెరిగింది.

లిస్టింగ్ రోజునే డబుల్కు పైగా పెరిగిన మరిన్ని షేర్లు..
- 21-03-207న కెరీర్ పాయింట్ రూ.310కి ఇష్యూ చేయగా, లిస్టింగ్ ఓపెనింగ్ 461, క్లోజంగ్ రూ.632.35గా ఉంది. లిస్టింగ్ రోజున 103.98 శాతం పెరిగింది. ప్రస్తుత ధర రూ.87గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 71.94 శాతం తగ్గింది.
- 26-09-2011న పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ రూ.210కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.200, క్లోజింగ్ రూ.411.65గా ఉంది. ఇది 96.02 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధర రూ.46.05గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 78 శాతం తగ్గింది.
- 14-10-10లో బెడ్ ముథా ఇండ్ రూ.102కు ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓఫెన్ 114.40, క్లోజింగ్ 180.80గా ఉంది. లిస్టింగ్ రోజున 77.25 శాతం పెరిగింది. ప్రస్తుత ధర రూ.10.25గా ఉంది. ఇష్యూ నాటితో పోలిస్తే 89.95 శాతం తగ్గింది.
- 30-06-2017న సీడీఎస్ఎల్ రూ.149కి ఇష్యూ చేస్తే లిస్టింగ్ ఓపెనింగ్ రూ.250 కాగా, క్లోజింగ్ 261.60గా ఉంది. ఇది 75.57 శాతం పెరిగింది. ప్రస్తుత ధర రూ.205గా ఉంది. ఇష్యూ నాటితో 37.58 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications