విస్తారా ఎయిర్లైన్స్ ఫెస్టివల్ ఆఫర్, 48 గంటల సేల్
న్యూఢిల్లీ: విస్తారా ఎయిర్ లైన్స్ డొమెస్టిక్ నెట్ వర్క్లో 48 గంటల సేల్ ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్లకు ఈ సేల్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా ఈ ఆఫర్ను తీసుకు వచ్చినట్లు విస్తారా తెలిపింది.
దసరా, దీపావళి.. ఫెస్టివల్ సీజన్ వ్యాపారులకు పెద్ద పండుగ. ఈ కాలంలో ఎక్కువగా సేల్స్ ఉంటాయి. వ్యాపారులు, ఈ-కామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి విస్తారా ఎయిర్ లైన్స్ కూడా ఈ ఆఫర్ ప్రకటించింది.
రుణాలు చౌక కానీ అక్కడే ట్విస్ట్: ఎంత తగ్గుతుంది
ఈ సేల్ కింద కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుందని, గురువారం అక్టోబర్ 10, 2019 (గురువారం) నుంచి శుక్రవారం అంటే అక్టోబర్ 11 రాత్రి 11.59 నిమిషాల వరకు ఉంటుందని తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ల ద్వారా పండుగ సీజన్ను మరింత హ్యాపీగా చేస్తున్నామని, అలాగే తమ వ్యాపార అభివృద్ధికి మరింతగా తోడ్పడుతుందని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ అన్నారు.
ఆఫర్ చేస్తున్న ప్రధాన మార్గాల్లో ఢిల్లీ - ముంబై, ముంబై - బెంగళూరు, ముంబై - గోవా, ఢిల్లీ - చెన్నై, ఢిల్లీ - బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోద్పూర్, ఉదయ్పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తిస్తుంది.