14 లక్షలమంది ఉద్యోగులకు అదిరిపోయో దీపావళి గిఫ్ట్, శాలరీ 'డబుల్'!
దసరా, దీపావళి పండుగ సీజన్లో కొనుగోళ్లపై ఆఫర్లు, ప్రభుత్వ, ప్రైవేటురంగ ఉద్యోగులకు బహుమతులు తెలిసిందే. అయితే 14 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు కూడా అదిరిపోయే పండుగ గిఫ్ట్ అందనుందట. ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వీజీ కన్నన్ లేఖ ప్రకారం అందరు బ్యాంకు ఉద్యోగులు దీపావళి పర్వదినం సందర్భంగా ఈ బహుమతి అందుకోనున్నారు.
నాడు నిజాం వేసిన రూ.8 కోట్లు వడ్డీతో నేడు రూ.306 కోట్లు: అన్నీ మనవే!
ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని అడ్వాన్సు కింద ఇవ్వాలని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు, విదేశఈ బ్యాంకుల హెడ్స్ను కోరింది. బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్ (DA) మొత్తం బ్యాంకు ఉద్యోగులకు అడ్వాన్సు శాలరీ రూపంలో అందనుంది. రెగ్యులర్ ఉద్యోగులు, స్టాఫ్, ఆఫీసర్స్కు ఈ ఫెస్టివెల్ అడ్వాన్స్ అందనుంది. దీపావళి పండుగకు ముందే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.
నవంబర్ 1, 2017 నుంచి రోల్స్లో ఉన్న వారికి ఈ అడ్వాన్స్ రానుంది. అయితే ఆ తర్వాత అంటే నవంబర్ 1, 2017 నుంచి మార్చి 31, 2019 మధ్య చేరిన ఉద్యోగులకు మాత్రం పండుగ అడ్వాన్స్గా వేతనంలో సగం వస్తుంది.
పండుగ సందర్భంగా అడ్వాన్స్ రూపంలో తీసుకున్న వేతనాన్ని బ్యాంకులు ఎరియర్స్లో సవరిస్తాయి. తద్వారా వేతన సవరణ సమయంలో ఈ అడ్వాన్స్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తాయి. బ్యాంకర్ల మనోధైర్యాన్ని పెంచేందుకు అడ్వాన్స్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు ఐబీఏ పేర్కొంది. దీనిని అడోక్ పేమెంట్గా చెబుతారు.