మీరు గమనించారా.. మీకు ఫోన్ వచ్చినప్పుడు ఎంత సేపు రింగ్ అవుతుందో... మీరు ఏదైనా పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వచ్చే సరికే ఫోన్ రింగ్ ఆగిపోతోందని గుర్తించారా. అప్పుడు మీరు ఏమనుకుని ఉంటారంటే.. మిస్డ్ కాల్ చేసి ఉంటారని. కానీ మీకు ఫోన్ చేసిన వారు మిస్డ్ కాల్ చేయలేదని, మీకు వచ్చే కాల్ రింగ్ సమయం తగ్గిందని మీకు తెలుసా. అవునండి ఇది నిజమే. టెలికాం కంపెనీలు మొబైల్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించాయి. ఇంతకు ముందు రింగింగ్ సమయం 45 సెకండ్లు ఉండేది. దాన్ని 25 సెకన్లకు తగ్గించారు. తాజాగా ఇదే విషయాన్నీ టెలికాం రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ట్రాయ్ కి ఎయిర్ టెల్ వెల్లడించింది.

అసలు ఏం జరిగిందంటే...
* దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. కస్టమర్లను సంపాదించుకోవడానికి ఈ కంపెనీలు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో రిలయన్స్ జియో అవుట్ గోయింగ్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించింది. ఇదే విషయాన్నీ ట్రాయ్ కి ఎయిర్ టెల్ తెలియజేసింది. దీన్ని 45 సెకన్లకు పెంచాలని లేదా 30 సెకన్ల కన్నా పెంచాలని కోరింది. కానీ జియో నుంచి స్పందన లేకపోవడంతో తన నెట్ వర్క్ నుంచి చేసే అవుట్ గోయింగ్ కాల్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గిస్తున్నట్టు ట్రాయ్ కి ఎయిర్ టెల్ తెలియ జేసింది.
* ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీ (ఐ యు సి ) నష్టాన్ని తగ్గించుకోవడానికి తాము కూడా రింగింగ్ సమయాన్ని తగ్గించక తప్పలేదని ఎయిర్ టెల్ అంటోంది. జియో పేరు వెల్లడించకుండా గత వారంలో ఎయిర్ టెల్ ఆరోపణలు చేసింది. అవుట్ గోయింగ్ కాల్ రింగింగ్ సమయాన్ని తగ్గించి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ వ్యవస్థతో ఆడుకుంటున్నట్టు పేర్కొంది.

జియో ఏమంటోందంటే...
* కొన్ని టెలికామ్ కంపెనీలు తమ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఐ యూ సి పేరుతో నిందిస్తున్నట్టు కంపెనీ అధికారి ఒకరు అంటున్నారు.
* ఈ కంపెనీలు తమ 2జి, 3జి కస్టమర్ల నుంచి వాయిస్ కాల్స్ కు ఎక్కువ చార్జీలను వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
* ఈ కంపెనీల కస్టమర్లు నిమిషానికి రూ.1.50 వరకు చెల్లించాల్సి వస్తోందని, ఇలా చెల్లించే కస్టమర్లు జియో వినియోగదారులకు మిస్డ్ కాల్ చేస్తూ తమకు తమకు కాల్ చేయమని కోరుతున్నారని అంటున్నారు. ఇది 25 శాతం నుంచి 30 శాతం వరకు ఉన్నట్టు చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉందంటే...
* ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రింగింగ్ సమయం 15-20 సెకన్లు అమల్లో ఉందని జియో వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 25 సెకన్ల కాలపరిమితి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైనదేనని అంటున్నారు.
* ప్రస్తుతం మన దేశంలో ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీ నిమిషానికి 6 పైసలుగా ఉంది.
* ఏ నెట్ వర్క్ కయితే కాల్ వెళుతుందో ఆ టెలికాం కంపెనీకి ఫోన్ వచ్చిన టెలికం కంపెనీ నిమిషానికి ఆరు పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది నిమిషానికి 14 పైసలు ఉండేది. 2020 జనవరి నుంచి ఇది సున్నాకు చేరనుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications