ముంబై: మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపించారు. దీంతో సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 38,667 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 11,475 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 70.75గా ఉంది.
యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. భారతీ ఎయిర్ టెల్, యాపిల్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, సీఈసీ షేర్లు లాభపడ్డాయి.

అంతకుముందు...
భా రత మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.42 సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు దిగజారింది. మధ్యాహ్నం గం.12.09 నిమిషాలకు సెన్సెక్స్ 287.17 (0.74%) పాయింట్లు కోల్పోయి 38,535.40 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 85.20 (0.74%) పాయింట్లు తగ్గి 11,427.20 వద్ద ట్రేడ్ అయింది. డాలర్కతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది.
అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజీలోని చైనా కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం డీలిస్ట్ చేయవచ్చుననే ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్ల పైన పడింది. ఉదయం యస్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిష్ టీవీ ఇండియా, అశోక్ లేలాండ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. వొడాఫోన్ ఐడియా, పెనిన్సులా ల్యాండ్, వక్రాంగీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అదానీ లాభాల్లో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 52వారాల గరిష్టాన్ని తాకాయి.
బంగారం ధర తగ్గింది. నేడు రూ.220 (-0.58%) తగ్గి 37,530.00గా ఉంది. కిలో వెండి ధర రూ.637 (-1.40%) తగ్గి 44,880.00గా ఉంది. క్రూడాయిల్ ధర పెరిగింది. బ్యారెల్కు 20 (+0.51%) పెరిగి 3954.00గా ఉంది.
మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్...
HCL Tech ప్రైస్ రూ.1,074.90. ఇది రూ.33.85 లేదా 3.25% పెరిగింది.
ఇన్ఫోసిస్ ప్రైస్ రూ.800.50. ఇది రూ.18.30 లేదా 2.34% పెరిగింది.
యూపీఎల్ ప్రైస్ రూ.594.55. ఇది రూ.12.50 లేదా 2.15% పెరిగింది.
భారతీ ఎయిర్ టెల్ ప్రైస్ రూ.354.45. ఇది రూ.5.35 లేదా 1.53% పెరిగింది.
టీసీఎస్ ప్రైస్ రూ.2,085.15. ఇది రూ.29.00 లేదా 1.41% పెరిగింది.
టాప్ లూజర్స్...
యస్ బ్యాంక్ ప్రైస్ రూ.41.75. ఇది రూ.7.00 లేదా 14.36% నష్టపోయింది.
ఇండస్ఇండ్ ప్రైస్ రూ.1,382.65. ఇది రూ.98.15 లేదా 6.63% నష్టపోయింది.
జీ ఎంటర్టైన్మెంట్ ప్రైస్ రూ.259.30. ఇది రూ.14.25 లేదా 5.21% నష్టపోయింది.
సిప్లా ప్రైస్ రూ.423.05. ఇది రూ.16.35 లేదా 3.72% నష్టపోయింది.
వేదాంత ప్రైస్ రూ.152.15. ఇది రూ.5.10 లేదా 3.24% నష్టపోయింది.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications