ఉల్లి ధర పెరగడానికి అసలు కారణం ఇదీ! అక్కడ కిలో రూ.22 మాత్రమే

ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి ధరలు కిలో రూ.50 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. ఢిల్లీ తదితర మార్కెట్లో కిలో రూ.70 నుంచి రూ.80 వరకు ఉండగా, హైదరాబాద్ మార్కెట్లో రూ.50 వరకు ఉంది. ఈసారి తక్కువ విస్తీర్ణంలో పంటకు తోడు వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పంట నీట మునిగింది. దీంతో తగినంత సరఫరా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి.

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు రాష్ట్రాల్లో ఉంచిన నిల్వలను డిమాండును బట్టి ఆయా ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వలపై పరిమితి విధించాలని యోచిస్తోందని చెబుతున్నారు.

ఎగుమతులను తగ్గించే చర్యలు

ఎగుమతులను తగ్గించే చర్యలు

అలాగే, ఉల్లి ఎగుమతులను తగ్గించేందుకు కనీస ఎగుమతి ధరను పెంచింది. ఎగుమతి ప్రోత్సాహకాలను ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులు తగ్గుతున్నాయి.

రూ.22 నుంచి రూ.24 వరకు విక్రయం

రూ.22 నుంచి రూ.24 వరకు విక్రయం

ఢిల్లీ వంటి పలు ప్రాంతాల్లో ఉల్లి వినియోగదారుల కంట నీరు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, మదర్ డైరీల ద్వారా కిలో రూ.22 నుంచి రూ.24కు విక్రయించేలా ఏర్పాట్లు చేసింది.

ఉల్లి ధర పెరగడానికి కారణమిది కూడా....

ఉల్లి ధర పెరగడానికి కారణమిది కూడా....

ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సరఫరాను మెరుగుపరిచి ధరలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు గత కొన్ని వారాలుగా కేంద్రం చర్యలు చేపట్టిందని, అయితే ప్రధానంగా ఉల్లిసాగు చేసే రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువడం వల్ల గత రెండు మూడు రోజుల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉల్లి ధరలు పెరగడానికి అసలు కారణం ఇదీ!

ఉల్లి ధరలు పెరగడానికి అసలు కారణం ఇదీ!

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాయితీలకు కోత వేయడం, కనీస ఎగుమతి ధర పెంపు ద్వారా ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులకు చెక్ పెడుతోంది. అయితే దేశంలో తగినన్ని ఉల్లి నిల్వలు ఉన్నాయని, వర్షాకాలం కారణంగా వాటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో మార్కెట్లో ధరలకు రెక్కలు వచ్చాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉంచిన ఉల్లిని విక్రయిస్తున్నామని, వర్షాకాల పంట దిగుబడులు నవంబర్ నెల మధ్య నుంచి మార్కెట్‌కు చేరుకుంటాయని చెబుతున్నారు. అప్పుడు మరింతగా తగ్గుతాయంటున్నారు.

గత ఏడాది రూ.10 ఇప్పుడు రూ.45

గత ఏడాది రూ.10 ఇప్పుడు రూ.45

ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వల్ని నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా సరఫరా చేస్తోంది. వాటిని కిలో రూ.22కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రంగ మదర్ డైరీల్లో రూ.24కు విక్రయిస్తున్నారు. కేంద్రం వద్ద 56 వేల టన్నుల ఉల్లి నిల్వలు ఉన్నాయి. ఇప్పటివరకు 16 వేల టన్నులను సరఫరా చేశారు. ఒక్క ఢిల్లీలో రోజుకు 200 టన్నుల ఉల్లి దిగుమతి అవుతోంది. ఉల్లిగడ్డకు హోల్‌సేల్ మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్గావ్. ఇక్కడ కిలో ఉల్లి ధర రూ.45గా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.10 కంటే తక్కువగా ఉంది. తమతమ రాష్ట్రాల్లోని కేంద్రం ఆధీనంలోని ఉల్లి నిల్వలను పెంచుకునేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయట.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+