పోలవరం రివర్స్ టెండరింగ్ పైన తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్ ఘన విజయంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిందని, తమను తాము కాపాడుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అర్థంపర్థం లేని ఆరోపణలకు దిగుతోందని వైసీపీ అంటోంది.
టీడీపీ పొంతనలేని, దిగజారుడు ఆరోపణలకు దిగుతోందని చెబుతున్నారు. దీంతో ఏపీలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా దిగజారుస్తోందని విమర్శిస్తున్నారు. టీడీపీ తమ వారికి చెందిన కంపెనీ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా, అధికార పార్టీ ప్రతీ చర్యను, ప్రతీ కాంట్రాక్టును విమర్శించడం ప్రారంభించిందని అంటున్నారు. అందులో భాగంగానే మేఘా కృష్ణారెడ్డి, ఆయన గ్రూపు సంస్థలపై విరుచుకుపడుతున్నాయని అంటున్నారు. మరోసారి క్విడ్ ప్రోకో ఆరోపణల అస్త్రాన్ని బయటకి తీసిందని అంటున్నారు.

ఇంతవరకు పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనిని కూడా మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెట్టకుండానే, ప్రధాన పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు కాకుండానే మొత్తం పోలవరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్కు కట్టబెడుతున్నారంటూ టీడీపీ సీనియర్ నాయకులంతా కట్టకట్టుకుని, పోలవరం ప్రాజెక్టుతో పాటు విద్యుత్ బస్సుల కొనుగోలు వ్యవహారం పైనా ఆరోపణలు కురిపిస్తున్నారని అంటున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications