ముంబై: భారత మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో తదుపరి కోత ఇప్పుట్లో ఉండకపోవచ్చుననే అభిప్రాయం మార్కెట్లపై పడింది. మధ్యాహ్నం గం.3.30 సమయంలో సెన్సెక్స్ 470.41 (1.29%) పాయింట్లు నష్టపోయి 36,093.47 వద్ద, నిఫ్టీ 144.30 (1.33%) పాయింట్లు కోల్పోయి 10,696.35 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు కూడా నష్టపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు డాలర్తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 71.15 వద్ద ట్రేడ్ అయింది.
యస్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ షేర్లు కుదేలయ్యాయి. విదేశీ పెట్టుబడులు నిరంతరంగా వెనక్కి మరలడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. వీటికి ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపాయి. ఫలితంగా ఎక్కువ సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి.

నిఫ్టీలో ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంకులు.. ఇలా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈలో దాదాపు 100 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. జీ ఈఎన్టీ, టాటా స్టీల్ 4-7 శాతం వరకు నష్టపోయింది.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications