ముంబై: భారత మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో తదుపరి కోత ఇప్పుట్లో ఉండకపోవచ్చుననే అభిప్రాయం మార్కెట్లపై పడింది. మధ్యాహ్నం గం.3.30 సమయంలో సెన్సెక్స్ 470.41 (1.29%) పాయింట్లు నష్టపోయి 36,093.47 వద్ద, నిఫ్టీ 144.30 (1.33%) పాయింట్లు కోల్పోయి 10,696.35 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు కూడా నష్టపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు డాలర్తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 71.15 వద్ద ట్రేడ్ అయింది.
యస్ బ్యాంకు, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ షేర్లు కుదేలయ్యాయి. విదేశీ పెట్టుబడులు నిరంతరంగా వెనక్కి మరలడం మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. వీటికి ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపాయి. ఫలితంగా ఎక్కువ సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి.

నిఫ్టీలో ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంకులు.. ఇలా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈలో దాదాపు 100 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. జీ ఈఎన్టీ, టాటా స్టీల్ 4-7 శాతం వరకు నష్టపోయింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications