టాప్ 10లో 6 కంపెనీల ఆదాయం రూ.50,000 కోట్లు పెరిగింది
గత వారం మార్కెట్లో టాప్ 10 కంపెనీల్లోని ఆరు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,580.35 కోట్లు పెరిగింది. ఆర్జించిన ఆరు కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంకులు ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), HDFC బ్యాంక్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకుల క్యాపిటలైజేషన్ గత వారం పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), HUL, ఇన్ఫోసిస్, ITCల మార్కెట్ వ్యాల్యు తగ్గింది.
గత వారం SBI మార్కెట్ వ్యాల్యూ రూ.15,841.19 కోట్లు పెరిగి రూ.2,60,330.92కు చేరుకుంది. ICICI బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ 14,062.37 కోట్లు పెరిగి రూ. 2,66,874.13కు చేరుకుంది.
సుకన్య సమృద్ధి యోజన బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?
కొటక్ మహీంద్రా మార్కెట్ వ్యాల్యూ రూ.8,011.67 పెరిగి రూ.2,83,330.41, HDFC ఎం క్యాప్ రూ.7,695.41 కోట్లు పెరిగి రూ.3,60,062.95 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ రూ.3,036.27 పెరిగి రూ.6,17,170.55 కోట్లకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంక్యాప్ రూ.1,933.44 పెరిగి రూ.7,76,891.25 కు చేరుకుంది.
ఇక, టీసీఎస్ మార్కెట్ వ్యాల్యూ రూ.21,125.9 కోట్లు దిగజారి రూ.8,03,516.90 కోట్లకు, ITC ఎంక్యాప్ రూ.4,914 కోట్లు తగ్గి రూ.2,94,778.17 కోట్లకు, ఇన్ఫోసిస్ వ్యాల్యూ రూ.4,724.55 కోట్లు తగ్గి రూ.3,56,123.44 కోట్లకు, హిందూస్థాన్ యూనివర్ లిమిటెడ్ ఎం క్యాప్ రూ.2,998.26 కోట్లు తగ్గి రూ.3,90,705.28 కోట్లకు పడిపోయింది.