ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.40 నిమిషాలకు సెన్సెక్స్ 110 పాయింట్ల లాభం, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 37,214, నిఫ్టీ 11,008 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అయితే మధ్యాహ్నం సమయానికి తిరిగి స్వల్ప నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం గం.11.45 నిమిషాలకు 33.20 (0.089%) పెరిగి 37,071.08 పాయింట్ల వద్ద ఉంది. ఉదయం 11 వేల మార్క్ దాటిన నిఫ్టీ ఆ తర్వాత మధ్యాహ్నానికి 12.45 (0.11%) నష్టపోయి 10,970.35 వద్ద ట్రేడ్ అయింది. గురువారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
మధ్యాహ్నం సెషన్ సమయానికి టెలికం షేర్లు మిక్స్డ్గా ట్రేడ్ అయ్యాయి. జీటీఎల్ షేర్లు 9.27 శాతం, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4.88 శాతం, టాటా టెలి సర్వీసెస్ 4.73 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

వొడాఫోన్ ఐడియా 2.89 శాతం, తేజాస్ నెట్ వర్స్ 2.26 శాతం, మహానగర్ టెలిఫోన్ నిగమ్ 1.83 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.51 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
నిఫ్టీలోని 50 స్టాక్స్లలో 19 లాభాల్లో, 31 నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్సీసీ, ఎల్ అండ్ టీ ఫిన్ హోల్డింగ్స్, పీఎఫ్సీ, సెయిల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఎన్ఎస్ఈలో 9 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ది ఫోనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, సాంకో ఇండస్ట్రీస్, సంఘినిటా కెమికల్స్, వాడీలాల్ ఇండస్ట్రీస్, వాటర్ బేస్ కంపెనీల స్టాక్స్ 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications