రూ.145 కోట్లు... గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు

న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా పెట్టుబడులు తరలిపోయిన గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) నిధుల రాక మళ్లీ ప్రారంభమైంది. గత ఆగస్ట్ నెలలో ఏకంగా రూ.145 కోట్ల ETF ఫండ్స్ వచ్చాయి. తొమ్మిది నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో రావడం ఇదే మొదటిసారి. బంగారం ధరలు భారీగా పెరగడం, డాలర్ మారకంతో రూపాయి బలహీనం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొన్నాయి. దీంతో భద్రత కలిగిన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దీంతో ఇటువైపు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ అసెట్ క్లాస్‌లో పెట్టుబడులు పెరగడం తొమ్మిది నెలల్లో ఇదే మొదటిసారి. గత ఏడాది నవంబర్ నెలలో రూ.10 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

Gold ETFs register first inflow in 9 months in August at Rs.145 crore

2012 డిసెంబర్ తర్వాత తిరిగి గోల్డ్ ETFలలోకి వచ్చిన నెలవారీ నికర పెట్టుబడుల్లో ఆగస్టులోనిదే అతిపెద్దది. ఆ ఏడాది డిసెంబర్ నెలలో రూ.474 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. గత నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు నెల, వార్షిక ప్రాతిపదికన చూస్తే మంచి వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో ఇన్వెస్టర్లు రూ.17.66 కోట్లు, గత ఏడాది (2018) ఆగస్టులో రూ.45 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) డేటా ప్రకారం రూ.145.29 కోట్లు గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్‌లలోకి గత నెలలో ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్ 2016లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.20 కోట్లు వచ్చాయి. అంతకుముందు మే 3, 2013లో రూ.5 కోట్లు వచ్చాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+