అన్ని వాహన విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ ఉండాలని ACMA అధ్యక్షులు రామ్ వెంకటరమణి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ట్రాన్స్మిషన్, ఇంజిన్ వంటి హైవ్యాల్యూ కాంపోనెంట్స్ పైన జీఎస్టీ 28 శాతంగా ఉంది. బ్రేక్స్, మఫ్లర్స్, వీల్స్ వంటి వాటి పైన 18 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటి పైన ఏకరీతిన 18 శాతం మాత్రమే విధించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన వార్థిక సమావేశంలో వారు మాట్లాడారు.

డిమాండ్ పెంచేందుకు చర్యలు
దేశవ్యాప్తంగా వాహన తయారీదార్లు డిమాండ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని, విడిభాగాల రంగం మొత్తానికి పద్దెనిమిది శాతం జీఎస్టీ చేసి ఆటో రంగానికి ఊతమివ్వాలని విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం అరవై శాతం వాహన విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ ఉందని, మిగతా 40 శాతం విడిభాగాలపై 28 శాతం జీఎస్టీ అమలు చేస్తున్నారని చెప్పారు.

18 శాతం జీఎస్టీ ఉంటే
అన్ని వాహనాల విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ ఉంటే వర్కింగ్ కేపిటల్ రుణాలను దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వాహన విడిభాగాల రంగంలో ప్రస్తుతం 50 లక్షలమంది వరకు ఉపాధి పొందుతున్నారు. దేశ జీడీపీలో 2.3 శాతం వాటా పరిశ్రమ కలిగి ఉందన్నారు.

బీటుబీ వ్యాపారం
ప్రధానంగా తాము బీటుబీ వ్యాపారంలో ఉన్నామని, కాబట్టి జీఎస్టీ 18 శాతానికి తగ్గించినా ఖజానాపై పెద్దగా ప్రభావం పడదని చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం భారీ మందగమనాన్ని ఎదుర్కొంటోందని, దీని నుంచి బయటపడేందుకు ఆటోమొబైల్స్ పైన జీఎస్టీ రేట్లు తగ్గించాలని కోరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఫైనాన్స్ అండ్ కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... సెప్టెంబర్ 20 జీఎస్టీ సమావేశం జరుగుతుందని, ఇప్పటికే ఆటో రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications