ఊగిసలాటలో మార్కెట్లు, లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.20 నిమిషాలకు సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 36,851 వద్ద ట్రేడ్ కాగా, నిఫ్టీ 50 పాయింట్లు ఎగిసి 10,895 వద్ద ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత కొద్దిగా నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం గం.11.51 నిమిషాలకు సెన్సెక్స్ 105.21 (0.29%) పాయింట్లు కోల్పోయి 36,619.53 వద్ద, నిఫ్టీ 5.00 (0.046%) పాయింట్లు కోల్పోయి 10,839.65 వద్ద ట్రేడ్ అయింది.
నేటి నుంచే జియో బ్రాడ్బాండ్, సెట్ టాప్ బాక్స్ ఉచితం
429 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ఉండగా, 140 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మరో 29 కంపెనీల షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.86 వద్ద ఉంది.
వేదాంత, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఐవోసీ, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్ టెల్ నష్టాల్లో ఉన్నాయి.