మార్కెట్: 161 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, నిఫ్టీ 39 పాయింట్లు
ముంబై: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు బుధవారం సాయంత్రానికి కోలుకున్నాయి. మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు లాభపడి 36,724 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 10,836 వద్ద ముగిసిందిం. 1197 కంపెనీలు లాభాలబాట పట్టగా, 1179 కంపెనీల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి. 163 కంపెనీల షేర్లలో మార్పు లేదు.
నష్టాల్లో ప్రారంభం
మంగళవారం
భారీ
నష్టాల్లో
ముగిసిన
మార్కెట్లు,
బుధవారం
ఫ్లాట్గా
ట్రేడింగ్
ప్రారంభించాయి.
ఉదయం
గం.9.45
నిమిషాలకు
సెన్సెక్స్
34
పాయింట్లు
నష్టపోయి
36,530
వద్ద
ట్రేడ్
కాగా,
నిఫ్టీ
13
పాయింట్లు
కోల్పోయి
10,784
వద్ద
ట్రేడ్
అయింది.
ఉదయం
గం.11.00
సమయానికి
89.81
(0.25%)
కోల్పోయి
36,473.10
వద్ద,
నిఫ్టీ
30.85
(0.29%)
నష్టపోయి
10,767.05
వద్ద
ట్రేడ్
అయింది.
ఆ
తర్వాత
సెన్సెక్స్
110
పాయింట్లకు
పైగా
దిగజారింది.
డాలర్తో
రూపాయి
మారకం
విలువ
కాస్త
కోలుకొని
71.85
వద్ద
ఉంది.
పెరిగిన బంగారం ధరలు... రూపాయి బలహీనంతో రికార్డ్ హైకి వెండి
బజాజ్ హిందూస్థాన్, మారికో, గెయిల్, బ్రిటానియా, జీ ఎంటర్టైన్మెంట్, వేదాంత, ఎల్ అండ్ టీ, హీరో మోటో కార్ప్, ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. రంగాలవారీగా చూస్తే FMCG, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్, రియాల్టీ, ఫార్మా రంగాల షేర్లు నష్టాలను చవి చూస్తున్నాయి. మెటల్ షేర్లు నష్టాల బాట పట్టాయి. NMDC షేర్లు 1 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 834 షేర్లు లాభాల్లో ఉండగా, 907 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 87 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఎన్ఎస్ఈలో 10 స్టాక్స్ 52 వారాల గరిష్టానికి పడిపోయాయి. అబోట్ ఇండియా, లిబాస్ డిజైన్స్, మెట్రోపాలిస్, హెల్త్కేర్, రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్స్ మేనేజ్మెంట్, సంఘ్వీ ఫోర్జింగ్ అండ్ ఇంజినీరింగ్, సంగీతా కెమికల్స్, వాడిలాల్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి.