రూ.1 లక్ష కోట్లకు దిగువన, అత్యల్పంగా జీఎస్టీ వసూళ్లు.. కానీ
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) కలెక్షన్లు ఆగస్ట్ 2019 నెలలో తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక ఇది అత్యల్పం. జూన్ నెలలో రూ.99,939 కోట్లు వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్, ఆగస్ట్ నెలలు మినహా మిగతా నెలల్లో కలెక్షన్లు రూ.1లక్ష కోట్ల మార్క్ దాటాయి.
అదే సమయంలో 2018లో ఆగస్ట్ నెలలో కంటే 4.51 శాతం పెరిగాయి. గత ఏడాది రూ.93,960 వసూళ్లు కాగా, ఈ ఏడాది రూ.98,202గా ఉన్నాయి. రూ.98,202 కోట్లలో రూ.17,773 కోట్లు కేంద్రం జీఎస్టీ కాగా, రాష్ట్రాల జీఎస్టీ వాటా రూ.24,239 కోట్లు. సమీకృత జీఎస్టీ రూ.48,958 కోట్లు. సెస్ రూ.7,273 కోట్లు.
రూ.15.50 పెరిగిన వంట గ్యాస్ ధర, ధర రూ.590
జీఎస్టీ తగ్గుదలకు ఆర్థిక మందగమనమే కారణంగా చెబుతున్నారు. ఉత్పాదక రంగం, సేవా రంగంలో నెలకొన్ని స్తబ్దత కారణంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని, దీని ప్రభావం జీఎస్టీ వసూళ్లపై పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. జీఎస్టీ తగ్గుదల నేపథ్యంలో ఆర్థిక లోటుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
మరోవైపు, ఆగస్ట్ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గడమే సాధారణమేనని చెబుతున్నారు. దీనిని ఆర్థిక మందగమనానికి ఆపాదించలేమని చెబుతున్నారు. ఆగస్ట్లో తగ్గినప్పటికీ అక్టోబర్ - డిసెంబర్ ఫెస్టివెల్ సీజన్ అని, అప్పుడు ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.