న్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ మన్మోహన్ సింగ్ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పని తీరు కారణమని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లోను మిస్మేనేజ్మెంట్ కారణంగా జీడీపీ వ్యవస్థ 5 శాతానికి పడిపోయిందని విమర్శించారు. అలాగే, ఆర్థిక వ్యవస్థ మందగించిందని, వివిధ రంగాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు.

5 శాతం పై మన్మోహన్ స్పందన
భారత ఆర్థిక వ్యవస్థ గత ఆరేళ్లలో మొదటిసారి నెమ్మదించిందని రెండు రోజుల క్రితం ప్రభుత్వ డేటా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి క్వార్టర్లో జీడీపీ 5 శాతంగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.8 శాతంగా ఉంది. జూన్ 30 2018 క్వార్టర్ (అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో) 8.0 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ స్పందించారు.

ఇంకా బయటపడలేదని
ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ అసమర్థ నిర్వహణ వల్ల ఈ దుస్థితి తలెత్తిందని మన్మోహన్ అన్నారు. ఉత్పాదక రంగం 0.6 శాతానికి పడిపోవడం తీవ్ర విచారం కలిగించే అంశమన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో లోపాల ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదని, దీనికి ఆర్థిక వ్యవస్థ మందగించడమే నిదర్శనం అన్నారు.

అన్ని రంగాలు దారుణంగా...
ఎన్డీయే హయాంలో నిరుద్యోగం పెరిగిందని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. వాహన రంగంలోనే 3.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. అసంఘటిత రంగంలోను పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఉపాది కోల్పోయారన్నారు.

దుర్బర పరిస్థితులు...
దేశీయ వినిమయంతగ్గిందని, వినియోగ వృద్ధి రేటు పద్దెనిమిది నెలల కనిష్టానికి పడిపోయిందని మన్మోహన్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఆదాయం బాగా పెరగడంతో రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజలు దుర్బర పరిస్థితులు చవి చూస్తున్నారన్నారు.

సంప్రదించండి...
ఈ ఆర్థిక మందగమనం మంచిది కాదని, ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు పక్కన పెట్టి, వివేకవంతమైన మార్గంలో నడవాలని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు మేధావులను, నిపుణులను సంప్రదించాలన్నారు. ఆర్థిక వృద్ధి పరుగు పెట్టాలంటే ఇదే మార్గం అన్నారు. గత త్రైమాసికంలో 5 శాతం జీడీపీ అంటే మనం తీవ్ర మందగమనంలో ఉన్నామని అర్థమని చెప్పారు. యువత, రైతాంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. అన్ని రంగాల వారికి ప్రభుత్వం ఇంకా ఎంతో చేయాలన్నారు.

ఆర్బీఐ నిధుల బదలీపై ఆక్షేపణ
చట్టబద్ద సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని మన్మోహన్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76 కోట్ల నిధులను బదలీ చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. బడ్జెట్ ప్రకటనలు, పథకాల అమలు తీరు విదేశీ ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. భౌగోళిక రాజకీయ కారణాలతో ఇంటర్నేషనల్లో పెరిగిన ఎగుమతుల అవకాశాలను ఒడిసిపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications