బజాజ్ ఫిన్ సర్వ్ గ్రూప్ నకు చెందిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోసం కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గరిష్టంగా 8.95 శాతం వరకు రిటర్న్ ను పొందవచ్చని చెబుతోంది. అంతే కాకుండా సులభమైన కాల పరిమితులను కూడా ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా డిపాజిట్ల కాలపరిమితి 12 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. మల్టీ డిపాజిట్, ఈజీ రెన్యూవల్ సదుపాయాలను అందిస్తోంది. ఇలాంటి వాటిలో ఎన్ఆర్ఐలు చాలా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చని కంపెనీ చెబుతోంది.
భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక రిటర్న్ ను ఆశించే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ డిపాజిట్ పథకాన్ని తెచ్చినట్టు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో పెట్టుబడులకు భద్రత ఉంటుందని, రెగ్యులేటరీ పరమైన వాతా వరణం కూడా బాగుందని అంటున్నారు.

అధిక వడ్డీ రేటు
* మార్కెట్ హెచ్చుతగ్గులతో సంభందం లేకుండా తమ ఫిక్స్డ్ డిపాజిట్ పై అధిక రిటర్న్ ను అందిస్తున్నట్టు బజాజ్ ఫైనాన్స్ చెబుతోంది.
* క్యుములెటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 36 నెలల పా టు ఎన్ ఆర్ ఐ లు పెట్టుబడి పెడితే 8.60 శాతం వరకువడ్డీ రేటు పొందవచ్చని చెబుతోంది.
* సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.85 శాతం నుంచి 8. 95 శాతం వరకు ఉంటుందని అంటోంది.
* బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కు క్రిసిల్ నుంచి అత్యంత స్థిరత్వం తో కూడిన ఎఫ్ఏఏఏ, ఇక్రా నుంచి ఎంఏఏఏ రేటింగ్స్ లభించినట్టు చెబుతోంది.
* ఈ రేటింగ్స్ పెట్టుబడులకు అత్యంత భద్రతను సూచిస్తాయని పేర్కొంది.
* ఎన్ ఆర్ ఐ లు ఏడాది నుంచి 3 ఏళ్ల కాలానికి డిపాజిట్ కాల పరిమితిని ఎంచుకోవచ్చు.
* పెట్టుబడులు ప్రారంభించడానికి ముందే తమకు ఎంత రిటర్న్ వస్తుందో లెక్క వేసుకునే సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది.
* ఇన్వెస్టర్లు తమ నచ్చిన కాల పరిమితి, సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి పెట్టే ఆలోచన చేయవచ్చు.

మల్టీ డిపాజిట్ సదుపాయం
* ఇక కాలంలో బహుళ ఎన్ ఆర్ ఐ ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా ఎంచుకోవచ్చని ఇందుకు సింగిల్ చెక్ ను వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
* మల్టీ డిపాజిట్ సదుపాయం వల్ల వేర్వేరుగా అప్లికేషన్లను నింపాల్సిన అవసరం ఉండదు. వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉన్న వారు ఈ కంపెనీ అఫర్ చేస్తున్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవచ్చు.
* ఫిక్స్డ్ డిపాజిట్లపై ఉండే పన్నులు తదితర పూర్తి వివరాలు కంపెనీ వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు.

భారత్ కు భారీగా ప్రవాసుల సొమ్ము
* ప్ర వాసులు విదేశాల నుంచి మనదేశానికి భారీ మొత్తంలో సొమ్మును పంపుతున్నారు.
* ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2018 సంవత్సరంలో ప్రవాస భారతీయులు పంపిన సొమ్ము 7,900 కోట్ల డాలర్లుగా ఉంది.
* ఇప్పటిదాకా చూస్తే ఎన్ ఆర్ ఓ ఖాతాల్లో 80,000 కోట్ల రూపాయలున్నాయి. వీటిపై సేవింగ్స్ ఖాతా నిల్వల మాదిరిగా చాలా తక్కువ వడ్డీ రేటు లభిస్తోంది.
* అయితే పెట్టుబడులకు భద్రత, సుస్థిర రాబడులను ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎన్ ఆర్ ఐ లు ద్రుష్టి సారిస్తే వారికీ ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications