లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

ముంబై: నిన్నటి వరకు నష్టాలు చవిచూసిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9:20 నిమిషాలకు సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 37,242 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 48 పాయింట్లు ఎగిసి 10,996 వద్ద కొనసాగింది. ఆ తర్వాత సెన్సెక్స్ 250 పాయింట్ల లాభానికి కూడా చేరుకుంది. అనంతరం నుంచి సెన్సెక్స్ నష్టాల బాట పట్టింది. మధ్యాహ్నం గం.11.30 నిమిషాలకు సెన్సెక్స్ 226.14 (0.61%) పాయింట్లు నష్టపోయి 36,842.79 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 67.50 (0.62%) పాయింట్లు తగ్గి 10,880.80 వద్ద ట్రేడయింది.

యస్ బ్యాంకు షేర్లు మూడు శాతం తగ్గి 55.55 వద్ద ట్రేడ్ అయ్యాయి. బ్యాంకు బోర్డు 1.2 బిలియన్ డాలర్లు సమీకరించే అవకాశముంది. గత మూడు ట్రేడింగ్‌లలో యస్ బ్యాంకు షేర్లు 14 శాతం నష్టపోయాయి. ఎన్ఎల్సీ ఇండియా 4 శాతం పెరిగింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Shares of YES Bank gained 3 per cent in Friday

ఉదయం గం.10.05 నిమిషాల సమయానికి బీఎస్ఈలో లాభపడిన వాటిల్లో టాటా స్టీల్, వేదాంత, టీసీఎస్, యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, టాటా మోటోరాస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐష ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు దాదాపు 3 శాతం వరకు ఎగిశాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఏసియన్ పేయింట్స్ షేర్లు నష్టాలబాట పట్టాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+