నిన్నటి భారీ లాభాలను నిలబెట్టుకుంటూ వరుసగా రెండో రోజు కూడా మెరుగైన పనితీరును కనబర్చి ఇన్వెస్టర్లలో కొద్దిగా ధైర్యాన్ని నింపింది స్టాక్ మార్కెట్. ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల రిజర్వ్ నిధులను మళ్లించడం కూడా పాజిటివ్ పాయింట్గా కలిసొచ్చింది. తొమ్మిది సెషన్స్ తర్వాత మళ్లీ 11 వేల పాయింట్ల ఎగువన నిఫ్టీ క్లోజవడం బుల్స్ను రేస్లో నిలబెట్టింది. అయితే ఈ రోజు కూడా మిడ్ సెషన్ తర్వాత ఒడిదుడుకులు కొద్దిగా టెన్షన్ పెట్టించాయి. 11,140 పాయింట్ల నుంచి నిమిషాల్లోనే 11,080 పాయింట్లకు దిగొచ్చింది నిఫ్టీ.
అయితే మరింతగా పడిపోవచ్చని భావించిన తరుణంలో నిఫ్టీ మళ్లీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లకు బూస్టింగ్నిచ్చాయి. ప్రభుత్వం ఆటో రంగానికి ఊతమిచ్చే దిశగా అడుగులు వేయడం ఆటో స్టాక్స్లో ఆశలు నింపింది. చివరకు సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 37641 దగ్గర ముగిసింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,105 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 28126 దగ్గర క్లోజైంది.

టాటా మోటార్స్, బ్రిటానియా, టాటా స్టీల్, యెస్ బ్యాంక్, ఎన్టీపీసీ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, గ్రాసిం స్టాక్స్ టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో చేరాయి.
ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ సూచీల్లో.. స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్ ఈ రోజు మార్కెట్లో మంచి ఉత్సాహాన్ని కనబర్చాయి. చాలా కాలం తర్వాత ఈ స్టాక్స్లో ఒక స్థిరమైన పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 2 శాతం వరకూ లాభపడింది. ఇక సెక్టోరల్ ఇండిసిస్లో ఐటీ, మీడియా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ లాభపడ్డాయి. ఆటో, మెటల్, పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ ఇండెక్స్లు మెరుగైన పనితీరు కనబర్చాయి.
బ్యాంక్ నిఫ్టీ రన్
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కూడా జోరుమీదుంది. ఆర్బీఎల్ మినహా దాదాపు ఈ ఇండెక్స్లో ఉన్న అన్ని షేర్లూ లాభపడ్డాయి. ముఖ్యంగా యెస్ బ్యాంక్ 3.5 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3 శాతం లాభపడ్డాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్పీఐ కూడా రెండు శాతం వరకూ పెరగడం బ్యాంక్ నిఫ్టీకి కలిసొచ్చింది.
మూడు నెలల తర్వాత
వరుస పతనాలతో కుప్పకూలిపోతూ.. నిత్యం 52 వారాల కనిష్టానికి పడిపోతున్న ఆటోమొబైల్ స్టాక్స్ ఈ రోజూ కాస్త తేరుకున్నాయి. ఆటో రంగానికి ఊతమిచ్చేందుకు బీఎస్6ను కాస్త ఆలస్యం చేయడం, వాళ్ల అప్పులను ఎన్పీఏలుగా తక్షణం పరిగణించకుండా కొన్ని మార్పులు చేయడం వంటివి కలిసొచ్చే అంశాలుగా చూస్తోంది మార్కెట్. దీంతో ఈ రోజు టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ స్టాక్స్ లాభాల స్పీడ్లో పరిగెట్టాయి. టాటా మోటార్స్ 9 శాతం, అశోక్ లేల్యాండ్ 6.2శాతం పెరిగాయి. మిగిలిన వాటిల్లో మదర్సన్ సుమీ, అపోలో టైర్స్, ఐషర్ స్టాక్స్ 3 శాతం వరకూ లాభపడ్డాయి. మూడు నెలల తర్వాత మళ్లీ ఈ స్టాక్స్ ఈ స్థాయిలో పెరుగుతుండడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.
వాడియా స్టాక్స్.. వారెవ్వా..
దేశానికి చెందిన పూర్వపు సంస్థల్లో ఒకటైన వాడియా గ్రూప్ స్టాక్స్ ఈ రోజు భారీగా లాభపడ్డాయి. ప్రధాన కారణమేదీ స్పష్టంగా తెలియనప్పటికీ ఈ స్టాక్స్ హై జంప్ చేశాయి. 1736 నుంచి ఇండియాలో వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న వాడియా గ్రూపునకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు నాలుగు ఉన్నాయి. వాటిల్లో బాంబే డైయింగ్, బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నేషనల్ పెరాక్సైడ్ ఉన్నాయి. ఈ రోజు ట్రేడ్లో బాంబే డైయింగ్ 20 శాతం, బాంబే బర్మా 18 శాతం, నేషనల్ పెరాక్సైడ్ 7 శాతం, బ్రిటానియా 6.4 శాతం పెరిగాయి.
రూపాయి పెరుగుతున్నా.. ఐటీ నీరసం
కరెన్సీ మార్కెట్లో రూపాయి కాస్త స్థిరంగానే ఉన్నా.. ఐటీ స్టాక్స్ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ రోజు డాలర్తో పోలిస్తే మన రూపాయి అర శాతం వరకూ తగ్గింది. అయితే ఈ మధ్యకాలంలో కొద్దో గొప్పో పెరిగిన నేపధ్యంలో ఈ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ పెరిగింది. ఇన్ఫోసిస్ 2.3 శాతం, మైండ్ ట్రీ 3.6 శాతం, టీసీఎస్, టెక్ మహ 2 శాతం వరకూ దిగొచ్చాయి.
మూడో రోజూ లాభాలు
యెస్ బ్యాంక్ స్టాక్ మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. ఈ రోజు స్టాక్ 2.06 శాతం లాభాలతో రూ.64.30 దగ్గర స్థిరపడింది. ఇదే బాటలో వరుసగా ఏడో రోజు కూడా లాభపడింది కాఫీ డే స్టాక్. ఈ రోజు కూడా 3.5 శాతం పెరిగి రూ.87.10 దగ్గర క్లోజైంది స్టాక్. ఈ మధ్య రూ.63 వరకూ పడిపోయిన స్టాక్ ఇప్పుడు కాస్త నిలదొక్కుకుంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications