హైదరాబాద్: చైనీస్ ప్రీమియం మొబైల్ ఫోన్ మేకింగ్ దిగ్గజం వన్ప్లస్ హైదరాబాదులో పరిశోధన, అభివృద్ధి (R&D) కేంద్రాన్ని నెలకొల్పింది. నానక్రామ్గూడలో 1,86,000 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన దీనిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. అత్యున్నత మౌలిక వసతులు, మెరుగైన మానవ వనరులు, పురోగమన విధానాలతో నగరంలోని కంపెనీలు అత్యుత్తమ సేవలు అందించవచ్చునని కేటీఆర్ పేర్కొన్నారు.

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ తయారీ కేంద్రంగా...
వన్ ప్లస్ సంస్థ తమ కీలక కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. భాగ్యనగరం కేంద్రంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ను తయారు చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ దోశ, బిర్యానీ బాగుంటుందని ఈ సందర్భంగా చెప్పారు.

త్వరలో హైదరాబాద్ వన్ప్లస్లో ఉద్యోగాలు
హైదరాబాద్ తమకు ఎంతో కీలకమైన ప్రాంతమని, దేశంలో తమకు స్వాగతం పలికిన తీరు, ఇక్కడ దక్కిన ఆదరణ సంతోషాన్ని ఇచ్చిందని వన్ప్లస్ వ్యవస్థాపకులు పీట్ లావ్ అన్నారు. హైదరాబాద్ భారత ఐటీ రంగ హబ్గా ఎదుగుతోందని, తమ R&D కేంద్రం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. మేకిన్ ఇండియాకు అనుగుణంగా ఉంటుందని, అలాగే దేశీయ, విదేశీయ అవసరాలు తీర్చేలా ఈ స్టోర్ ఉంటుందని చెప్పారు. 5G టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, AI రంగాల్లో కేంద్రం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. త్వరలో కొత్త ఉద్యోగుల్ని నియమించుకుంటామన్నారు. ప్రస్తుతం 200 మంది నిపుణులు ఉన్నారని, మూడేళ్లలో 1500 మంది ఉద్యోగులకు చేరుతుందన్నారు.

రూ.1000 కోట్లు ఇన్వెస్ట్, ఇక్కడి నుంచి మొబైల్ ఎగుమతులు
అంతర్జాతీయ మార్కెట్కు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ అభివృద్ధి చేస్తామని పీట్ లావ్ అన్నారు. కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్ అండ్ నెట్ వర్కింగ్ ల్యాబ్, ఆటోమేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కెమెరా ల్యాబ్కు రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, మూడేళ్లలో కంపెనీకి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద R&D కేంద్రంగా అవతరిస్తుందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వన్ ప్లస్ ఇండియా జీఎం వికాస్ అగర్వాల్ చెప్పారు. ఆవిష్కరణల విషయంలో భాగ్యనగరాన్ని ప్రపంచపటంలో నిలుపుతామని చెప్పారు. ఈ ఏడాదే భారత్ నుంచి విదేశాలకు మొబైల్ ఫోన్స్ ఎగుమతి చేస్తామన్నారు.

భారత్ వాటాతో అగ్రస్థానం
ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ రంగంలో ప్రపంచంలో రెండు శాతం వాటాతో తొలి ఐదు స్థానాల్లో ఉన్నామని, భారత్లో 43% వాటాతో అగ్రస్థాయిని కైవసం చేసుకున్నామన్నారు. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్ నగర్లో నిర్మిస్తున్న అతి పెద్ద ఎక్స్పీరియెన్స్ జోన్ను అక్టోబరు-డిసెంబరు మధ్య ప్రారంభిస్తామన్నారు. భారతీయ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్ఫోన్లలో జెన్ మోడ్, ఎస్సెమ్మెస్ ఇన్ బాక్స్ లాంటి ఫీచర్స్ తీసుకు వస్తామన్నారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications