జీఎస్టీ రిటర్న్స్ పైలింగ్ గడువు మూడు నెలలు పొడిగింపు

న్యూఢిల్లీ: జీఎస్టీ యాన్యువల్ రిటర్న్స్‌లో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి గుడ్ న్యూస్. వార్షిక రిటర్న్స్ దాఖలు గడువును మూడు నెలల పాటు పొడిగించారు. నవంబర్ 30వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.

ఈ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని పన్ను చెల్లింపుదారుల నుంచి చాలా ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గడువును పెంచారు. ఇప్పటి వరకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చివరి తేదీ ఆగస్ట్ 31. కానీ ఇప్పుడు మూడు నెలల పాటు పొడిగించారు.

 Last date to file GST annual returns extended till November 30

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ 9, జీఎస్టీఆర్ -9ఏ, జీఎస్టీఆర్-9సి దాఖలు చేసేందుకు గడువును 2019 ఆగస్ట్ 31వ తేదీ నుంచి నుంచి 2019 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) వెల్లడించింది.

జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే వార్షిక రిటర్న్స్ జీఎస్టీఆర్ 9. రూ.2 కోట్ల టర్నోవర్‌ను మించితే జీఎస్టీఆర్ 9సీ, కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకుంటే జీఎస్టీఆర్-9ఏ రిటర్న్స్ దాఖలు చేయాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+