ముంబై: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (ఆగస్ట్ 23, 2019) ఐదు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అలాగే ఉంది. దాదాపు అన్ని రంగాలు ఆర్థికమాంద్యం భయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు, శుక్రవారం ఉదయం నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి.

మార్కెట్లకు నిర్మలా ప్రెస్ మీట్ ఉత్తేజం
అయితే నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తారని తెలియడంతో మార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చివరి గంటలో సెన్సెక్స్, నిఫ్టీలు పైకి ఎగిరాయి. ముఖ్యంగా FPIల పెట్టుబడులపై ఊరట కలిగించే ప్రకటన ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మార్కెట్లో సాయంత్రానికి కొత్త ఉత్సాహం కనిపించింది. 228.23 (0.63%) పాయింట్ల లాభంతో 36,701.16 వద్ద సెన్సెక్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 88.00 (0.82%) ఎగబాకి 10,829.35 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 200కు పైగా పాయింట్ల నష్టానికి చేరుకుంది. కానీ సాయంత్రానికి పుంజుకుంది.

సూపర్ రిచ్కు ఊరట
వివిధ రంగాల్లో ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతోంది. విదేశీ ఫోర్టుఫోలియో ఇన్వెస్టర్లను (FPI) సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ రిచ్ పైన విధించే సర్ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రకటన రావొచ్చు. అదే సమయంలో ఆర్థిక మందగమనంపై ఉద్దీపన చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. అధికారికంగా నిర్మల వీటిని వెల్లడించనున్నారని తెలుస్తోంది.

ఎఫ్పీఐలు వెనక్కి...
FPIలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్లు సాయంత్రానికి ఉత్సాహంతో క్లోజ్ అయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆదాయ పన్ను ఉన్నవారికి వర్తించే సర్ఛార్జ్ 15%నుంచి 25%, రూ.5 కోట్ల పైన పన్ను ఆదాయం ఉన్న వారికి సర్ఛార్జిని 15% నుంచి 37%కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని పరిధిలోకి FPIలు కూడా వచ్చారు. దీంతో పెట్టుబడులు గత కొన్నాళ్లుగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. అలాగే, ఆటో రంగానికి సంబంధించి ఉద్దీపన చర్యలు చేపట్టే అవకాశముంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications