న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కేంద్రం నుంచి అత్యవసర సాయం కోరుతోంది. వెంటనే రూ.2,500 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కంపెనీకి దాదాపు రూ.60,000 కోట్ల రుణాలు ఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాకు రూ.7,600 కోట్ల రూపాయల సమీకరణకు కేంద్రం సావరీన్ గ్యారంటీకి ఆమోదం తెలిపింది.
కేంద్రం ఈ మొత్తానికి ఆమోదం తెలిపిందని, తాము రూ.5,000 కోట్ల రుణాన్ని సేకరించామని, రూ.2,464 కోట్లు మిగిలి ఉందని, ఈ మొత్తాన్ని తమకు రుణంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ఆర్థిక పనితీరు చాలా బాగుందని, తాము ఆరోగ్యకరమైన లాభాల వైపు పయనిస్తున్నామని, వైమానిక రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ, ఎయిరిండియా పరిస్థితి బాగుందని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.29,000 కోట్ల రుణాలని తగ్గించుకున్నామని, ఇది ఉపశమనం కలిగించే అంశమని తెలిపారు.
కాగా, ఎయిరిండియాకు గురువారం షాక్ తగిలిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం నుంచి దేశీయంగా ఉన్న ఆరు విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. పాత బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇంధన సరఫరా నిలిపేసినట్లు ఓ అధికారి తెలిపారు. అయినప్పటికీ విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయని, వీటిపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. కాగా, కంపెనీలు కొచ్చి, విశాఖ, మొహాలీ, రాంచీ, పుణె, పాట్నా ఎయిర్ పోర్టుల్లో ఇంధన సరఫరా నిలిపివేశాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications