న్యూఢిల్లీ: అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం సహా పలు కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై దృష్టి సారించారు. గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునే పరిష్కార మార్గాల గురించి చర్చించారు. ఏయే రంగాలపై ఏ మేర ప్రభావం ఉంటుంది, ఎలా ఎదుర్కోవాలి, ఉద్యోగాలు కోల్పోకుండా ఏం చేయాలనే అంశాలపై చర్చించారు.

ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలకు దెబ్బ
ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పైన ఎలా ఉంటుందనే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు. మాంద్యం బారినపడకుండా ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగిందట. ఇప్పటికే ఆటోమొబైల్ ఇండస్ట్రీ దారుణంగా పడిపోయింది. వీటి సేల్స్ 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. FMCG సేల్స్ కూడా తగ్గాయి. రియాల్టీ కూడా ఆశించినంతగా లేదు. NBFC సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో మాంద్యం బారినపడకుండా ఆయా రంగాల వారీగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

రంగాలవారీగా ప్రోత్సాహకాలు
అంతర్జాతీయ పరిణామాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం కూడా పడుతోంది. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం మిగతా అన్ని దేశాలపై పడుతోందని, ఇది పెను నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఈ ప్రభావం భారత్ పైన కూడా ఉంటుందంటున్నారు. ఈ మాంద్యం ప్రభావం భారత్ పైన ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవడానికి మోడీ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా రంగాలకు ప్రోత్సాహకాలు త్వరలో ప్రకటించనున్నారని, తద్వారా ఆయా రంగాలకు భారీ ఊరట కలిగించనున్నారని చెబుతున్నారు. పన్ను తగ్గింపు లాంటి చర్యలు తీసుకోనుంది.

మాంద్యం ప్రభావం భారత్పై తక్కువేనా?
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.8 శాతంగా ఉంది. 2015-16 తర్వాత ఇదే అత్యల్పం. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్య ప్రభావం మన దేశం మీద అంతగా ఉండకపోవచ్చునని మోర్గాన్ స్టాన్లీ ఇటీవల అంచనా వేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, వాహన పరిశ్రమల లాంటివి మందగమనంలో ఉన్నప్పటికీ మాంద్యం దరిచేరకపోవచ్చునని పేర్కొంది. దశాబ్దం క్రితం ఇలాగే మాంద్యం ఏర్పడినప్పుడు అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్ పైన ప్రభావం తక్కువగా పడింది. మిగతా దేశాల కంటే త్వరగా కోలుకుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications