ముంబై: శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి కాస్త కోలుకున్నాయి. స్వల్ప లాభాలతో మార్కెట్లు క్లోజ్ అయ్యాయి.సెన్సెక్స్ 38.80 పాయింట్ల లాభంతో 37,350.33 వద్ద క్లోజైంది. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,047 వద్ద క్లోజ్ అయింది. ప్రభుత్వం ట్యాక్స్ ఉపసంహరణలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో మార్కెట్లు శుక్రవారం మొత్తం ఊగిసలాటలో కనిపించి, చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి.
పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, వేదాంత, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాలతో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. అపోలో ఆసుపత్రి షేర్లు ఏడు శాతం లాభపడ్డాయి. దీంతో 52 వారాల గరిష్ఠానికి చేరుకొన్నాయి.

ఉదయం మార్కెట్..
మార్కెట్లు శుక్రవారం నాడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 37,076 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,955 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.36గా ఉంది. యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, వేదాంతా, టాటా స్టీల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం ఏకంగా 325 పాయింట్లు దిగజారి 36,986 వద్ద కూడా ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం పది గంటల సమయంలో 184 పాయింట్లు (0.48 శాతం) నష్టపోయి 37,127 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 59 పాయింట్లు (0.52 శాతం) కోల్పోయి 10,970 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications