తెలుగు హీరో నాగశౌర్యకు పోలీసుల షాక్
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో రూ.500 ఫైన్ వేశారు. అంతేకాదు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ను కూడా తొలగించారు. పోలీసులు చలానా విధించడంతో నాగశౌర్య ఫైన్ చెల్లించి అక్కడి నుంచి కదిలారు.
ఏపీకి గుడ్న్యూస్, ప్యామిలీకి హెల్త్ కార్డు: రూ.1000 దాటితే ఫ్రీ వైద్యం
నాగశౌర్య కారుకు బ్లాక్ ఫిల్మ్
నటుడు నాగశౌర్య తన ఫోర్డ్ ఎండీవర్ కారులో వెళ్తున్న సమయంలో.. ఆ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారును ఆపి ఫైన్ విధించినట్లు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంరవి.. ఎఎన్ఐకి తెలిపారు.
పంజాగుట్ట నుంచి వస్తుండగా..
'నేను పంజాగుట్ట ప్రాంతంలోని ఎంజే కాలేజీ సమీపంలో డ్యూటీలో ఉన్నాను. అప్పుడు ఓ ఎండీవర్ కారు అటువైపుగా వచ్చింది. అది పంజాగుట్ట నుంచి వస్తోంది. ఆ కారు గ్లాసెస్కు బ్లాక్ ఫిల్మ్ ఉండటాన్ని గుర్తించి ఆపాను' అని సదరు ట్రాఫిక్ పోలీస్ అధికారి తెలిపారు.
బ్లాక్ ఫిల్మ్ తొలగించిన ట్రాఫిక్ పోలీసు
కారు ఆపి చూస్తే, ఆ కారు నాగశౌర్యది అని అర్థమైందని, ఆ కారులో అతను కూడా ఉన్నాడని, ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు నిబంధనల మేరకు రూ.500 ఫైన్ వేశామని అధికారి చెప్పారు. ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని అతనికి చెప్పామన్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ కారుపై ఉన్న బ్లాక్ ఫిల్మ్ను తొలగించారు. అతను ఫైన్ చెల్లించాడన్నారు.