అక్కడ బంగారం ధర రూ.87,000
రావల్పిండి: భారతదేశంలో బంగారం ధరలు రూ.38 వేలు దాటాయి. త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని అంచనా. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. భారత్లో బంగారం ధర రూ.40వేల వరకు వస్తేనే అందరూ అమ్మో.. అంటున్నారు. కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. అయితే పాకిస్తాన్లో బంగారం ధర భారత్ కంటే రెండింతలు ఉంది.
సోమవారం (ఆగస్ట్ 12)వ తేదీన పాకిస్తాన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ బంగారం రూ.87,000గా ఉంది. పాకిస్తాన్లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, టెన్ తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి.
అత్యధిక శాలరీ హైదరాబాదీదే! సన్ ఫార్మా ఎండీ వేతనం ఒక్కరూపాయే
కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి.