ఆర్బీఐ సమీక్ష, రెపో రేటు 25 శాతం తగ్గించే ఛాన్స్

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం మధ్యాహ్నం గం.11.45 నిమిషాలకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్స్ అంటే పావు శాతం తగ్గించే అవకాశముందని భావిస్తున్నారు. ద్రవ్యల్బోణం అదుపుకు తోడు ఆర్థిక కార్యకలాపాల ఊతానికి ఆర్బీఐ రేట్లను తగ్గించవచ్చునని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఆర్బీఐ మూడో ద్వైమాసిక పరపతి సమీక్ష. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆటోమొబైల్ సేల్స్ తగ్గడం, మౌలికరంగ వృద్ధి దిగజారడం, రుతు పవనాలు, స్టాక్ మార్కెట్ల క్షీణతపై ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గు చూపే అవకాశముందని అంచనా.

All eyes on Repo: RBI likely to cut repo rate by 25 bps

మంగళవారం నాడు మార్కెట్లు కూడా వడ్డీ రేట్ల కోత ఆశలతోనే తేరుకున్నాయి. కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లకు నిన్న ఉపశమనం లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసికపు సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందనే ఆశలతో ఈ రిలీఫ్ లభించింది. ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు చేశారు.

ఫలితంగా అయిదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సూచీలు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. మంగళవారం ఓ దశలో 500 పాయింట్లకు పైగా లాభపడి 37 వేల పైకి చేరుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 36,976.85 వద్ద క్లోజ్ అయింది. సోమవారంతో పోలిస్తే 277.01 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 85.65 పాయింట్లు లాభపడి 10,948.25 వద్ద క్లోజ్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+