ఊరందరిదీ ఓ దారైతే.. ఉలిపి కట్టెది మరో దారి అనేట్టు.. ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన తరుణంలో మన స్టాక్ మార్కెట్ సూచీలు మాత్రం బలంగా నిలదొక్కుకున్నాయి. అమెరికా, యూరోప్, ఆసియా మార్కెట్లలో భారీ పతనాన్ని చూసిన నేపధ్యంలో మన సూచీలు కూడా ఈ రోజు షాక్కు గురికావాల్సిందేనని అనుకున్నారు. అయితే బలమైన షార్ట్ కవరింగ్ నేపధ్యంలో మన సూచీలు లాభాల్లో పయనించాయి. నిఫ్టీ మళ్లీ 11 వేల పాయింట్ల మార్కును దాటి పైకి పయనించింది. ఐటీ, మీడియా మినహా దాదాపు అన్ని రంగాల సూచీల నుంచి మద్దతు లభించడంతో నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 10948 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 277 పాయింట్లు పెరిగి 36976 వద్ద క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 28 వేల 22 దగ్గర స్థిరపడింది.
మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.23 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం లాభపడ్డాయి. ఇవి కాకుండా రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా కనిపించింది.

ఇండియాబుల్స్ హౌసింగ్, యెస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. జీ ఎంటర్టైన్మెంట్, సిప్లా, రిలయన్స్, పవర్ గ్రిడ్, టిసిఎస్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
టైటన్కు కలిసి రాలేదు
టైటన్ సంస్థ ఈ సారి కూడా త్రైమాసిక ఫలితాల్లో కాస్త వెనుకబడింది. ఆధాయంలో 14.4 శాతం, నికర లాభంలో 6.2 శాతం వృద్ధిని సాధించగలిగింది. ఇండస్ట్రీ అంచనాలను ఆకట్టుకోలేకపోవడంతో స్టాక్ ఫ్లాట్గా ముగిసింది. కేవలం 0.12 శాతం లాభంతో రూ.1038 దగ్గర క్లోజైంది.
డిహెచ్ఎఫ్ఎల్ను గాడిలోపెట్టే పని
అప్పుల్లో కూరుకుని, లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్కు స్పెషల్ ప్యానెల్ ఓ పరిష్కార నివేదికను అందజేసింది. ఎర్నస్ట్ అండ్ యంగ్తో చర్చించిన అనంతరం ఎక్స్ఛేంజీలకు అందిన ఈ ముసాయిదా నేపధ్యంలో స్టాక్ పైపైకి పరుగులు తీసింది. ఏకంగా ఒకే రోజు 32 శాతం లాభపడి రూ.55 దగ్గర క్లోజైంది.
ఏడో రోజూ.. ఏడుపే
జీ ఎంటర్టైన్మెంట్స్ స్టాక్ వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసింది. అక్టోబర్ 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే వరుస పతనాలతో స్టాక్ కుదేలవుతోంది. ప్రత్యేక కారణమేదీ లేకపోయినప్పటికీ స్టాక్ ఈ రోజు ఇంట్రాడేలో 8 శాతం వరకూ నష్టపోయింది. చివరకు 6 శాతం నష్టాలతో రూ.312 దగ్గర క్లోజైంది.
అంచనాలను మించిన ఎస్ఆర్ఎఫ్
సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం 9.1 శాతం, నికర లాభం 42 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్జిన్లలో కొద్దిగా మార్పు ఉంది. ఒక్కో షేర్కు సంస్థ రూ.7 డివిడెండ్ను ప్రకటించింది. ఫ్లోరోపాలిమర్స్ సెగ్మెంట్లోకి సంస్థ అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో రూ.424 కోట్లతో ప్రత్యేక సమీకృత కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు చెప్పింది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ 17 శాతం వరకూ పెరిగింది. చివరకు 15 శాతం లాభంతో రూ.2988 దగ్గర క్లోజైంది.
పిడిలైట్ పటిష్టం
ప్రముఖ ఫెవికాల్ బ్రాండ్ సంస్థ పిడిలైట్ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో ఆదాయం 10 శాతం, నికర లాభం 23 శాతం వృద్ధి నమోదైంది. ఎబిటా 17 శాతం, మార్జిన్లు 22 శాతానికి చేరాయి. దీంతో స్టాక్ 3 శాతం పెరిగి రూ.1308 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications