ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు మార్కెట్లకు జమ్ము కాశ్మీర్ టెన్షన్ భయం పట్టుకుంది. సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. అంతకుముందు గం.11.19 నిమిషాలకు సెన్సెక్స్ 621 పాయింట్లు (1.67 శాతం) నష్టపోయి 36,497 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 10,812 (1.68) శాతం కోల్పోయింది.
మార్కెట్లు నష్టాల్లో ఉండటానికి అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు జమ్ము కాశ్మీర్ ఉద్రిక్తతలు కారణం. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, వేదాంత, ఎస్బీఐ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, రిలయన్స్, మారుతీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత పడిలేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. ఓ సమయంలో 10,800కు దిగజారిన నిఫ్టీ, మధ్యాహ్నం 10,900కు చేరుకుంది. సెన్సెక్స్ 500 పాయింట్ల నుంచి 700 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
జమ్ము కాశ్మీర్కు సంబంధించి నాలుగైదు రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. అయితే సోమవారం ఆర్టికల్ 370 రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.
మరోవైపు, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్ 370(3)తో జమ్ము కాశ్మీర్ లెజిస్లేటీవ్ అసెంబ్లీగా మారుతుంది. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపించే అవకాశముంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications