నిబంధనలు పాటించని ప్రభుత్వరంగ బ్యాంకులపై భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్ బీ ఐ) కొరడా ఝళిపిస్తోంది. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తోంది. ఈ బ్యాంకులు నిర్దేశిత నిబంధనల మేరకు వ్యవహరించకపోవడమే జరిమాణాలకు కారణం.
ఇవీ జరిమానాలు
* అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ అఫ్ మహారాష్ట్రలకు రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా లకు రూ. 1.5 కోట్ల చొప్పున, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు రూ. 1 కోటి జరిమానాను విధించింది. కరెంట్ ఖాతా లను ప్రారంభించడంలో అనుసరించాల్సిన నిబంధనలు ఈ బ్యాంకులు పాటించకపోవడం వల్లనే జరిమానాలు విధించినట్టు ఆర్ బీ ఐ వెల్లడించింది. ఖాతాలు ప్రారంభించడంలో నిబంధనలు పాటించలేదని ఆర్ బీ ఐ గుర్తించి వీటికి సంబంధించి వివరణ ఇవ్వాలని బ్యాంకులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి బ్యాంకులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి బ్యాంకులకు ఆర్ బీ ఐ జరిమానాలు విధించింది.

* బ్యాంకులకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్ కు సంబంధించిన నిబంధనలు పాటించనందుకు కార్పొరేషన్ బ్యాంకుకు రూ. కోట్ల జరిమానాను విధించింది.
* నిబంధనలు పాటించని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడాలకు కూడా ఆర్బీఐ జరిమానాలు విధించింది.
* మోసాలను ప్రకటించడంలో జాప్యం చేసినందుకు ఆర్బీఐ జరిమానా విధించినట్టు తొమ్మిది బ్యాంకులు వెల్లడించాయి.
* కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఖాతాల విషయంలో మోసాన్ని వెల్లడించడంలో జాప్యం చేసినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ రూ.50 లక్షల జరిమానాను విధించింది.
* కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విషయంలోనే మోసాన్ని వెల్లడించడంతో జాప్యం చేసిన కారణంగా ఓరియంటల్ బ్యాంక్ అఫ్ కామర్స్ కు రూ. 1.5 కోట్ల జరిమానా పడింది. ఆర్బీఐ ఆదేశాలు అందిన 14 రోజుల్లో ఈ జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.
* యునైటెడ్ బ్యాంక్ అఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులకు రూ. కోటిచొప్పున జరిమానా పడింది.
* మోసాలకు సంబంధించిన నిబంధనలు పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.50 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది.
* బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ లకు రూ. 50 లక్షలు, కార్పొరేషన్ బ్యాంకు, యూకో బ్యాంక్లకు కూడా జరిమానా పడింది.
నిఘాపెట్టిన ఆర్బీఐ
* ప్రభుత్వ రంగ బ్యాంకులు చిన్న పొరపాట్లు చేసినా ఆర్బీఐ సహించడం లేదు.
* బ్యాంకులు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం పాటించడం వల్ల మోసాలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించే బ్యాంకులకు భారీగా జరిమానాలు విధిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications